ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ జోష్ లో ఉన్న నందమూరి హీరోలు, వరుస సినమాలతో బిజి అవుతున్నారు. ముఖ్యంగా నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన గత చిత్రం టెంపర్.. సూపర్ సక్సెస్ కావడంతో, ఎన్టీఆర్ ఫుల్ ఎనర్జిటిక్ గా ఉన్నాడు.

అదే విధంగా మరో నందమూరి హీరో అయిన  కళ్యాణ్ రామ్ సైతం పటాస్ మూవీలో తిరిగి ఫాంలోకి వచ్చాడు. దీంతో ప్రస్తుతం ఈ ఇద్దరి హీరోల నుండి ఒకే మాట, ఒకే కోరిక అంటూ ఇద్దరు వారి మనస్సులోని మాటను బయటకు చెప్పుకున్నారు. అ మాటే, ఆ కోరికే ఇద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ మూవీని తీయటం. అవును, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో త్వరలోనే ఓ మల్టీస్టారర్ సెట్స్ మీదకు వెళ్ళనుంది.

దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకుంటే, ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ జూలై మొదటివారం నుండి లండన్‌లో షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ హీరోగా ఓ మల్టీస్టారర్ సినిమాకు సన్నహాలు చేస్తున్నారు.

నందమూరి కళ్యాణ్‌రామ్‌తో కలిసి ఈ సినిమా చేయాలనే ప్లాన్‌లో ఉన్నారని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ సినిమాతో రచయిత అయిన వక్కంతం వంశి దర్శకుడిగా మారనున్నాడు. ఇప్పటికే వంశీ స్క్రిప్ట్‌ను కూడా రెడీ చేశాడని సమాచారం. ఈ చిత్రానికి నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మాతగా ఉంటారని టాక్స్ వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: