ప్రభాస్ తనను క్షోభ పెట్టడమే కాకుండా మరణం అంచు వరకు తనను తీసుకు వెళ్ళి తెగ బాధ పెట్టాడు అంటూ ప్రభాస్ పై నేరాలు చెపుతోంది తమన్నా. ‘బాహుబలి’ సినిమాలోని అవంతిక పాత్రను పోషిస్తున్న తమన్నా ‘బాహుబలి’ ప్రమోషన్ లో బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. 


ప్రభాస్ తనకు అనేక జాగ్రత్తలు చెప్పేవాడని కామెంట్ చేసింది తమన్నా


తాను మొట్టమొదటి సారిగా తన కెరియర్ లో ఒక రాజకుమారిగా నటిస్తూ కత్తి యుద్ధాలు గుర్రపు స్వారీలు చేస్తూ ప్రభాస్ తో యుద్ధ సన్నివేశాలలో నటిస్తున్నప్పుడు ప్రభాస్ తనకు అనేక జాగ్రత్తలు చెప్పేవాడని కామెంట్ చేసింది తమన్నా. అయితే తనకు ఇన్ని జాగ్రత్తలు చెప్పిన ప్రభాస్ ఇదే సినిమా షూటింగ్ లో గాయపడి సర్జరీల వరకు వెళ్ళాడన్న విషయాన్ని చెప్పుకొచ్చింది తమన్నా.

ఈ సినిమా షూటింగ్ విషయంలో తనను ఎవరు బాగా ఆట పట్టించారు అన్న మీడియా ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రభాస్ తనను ఆట పట్టించడమే కాకుండా అతిగా తినిపించి మరణం అంచుల వరకు తీసుకువెళ్ళి అక్కడ వదిలేసాడు అంటూ ప్రభాస్ పై సెటైర్లు వేసింది. 

తాను షూటింగ్ బ్రేక్ సమయంలో తన క్యార్ వాన్ లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ప్రభాస్ రకరకాల ఫుడ్ ఐటమ్స్ ను తన వేన్ లోకి పంపించి అవన్నీ తినమని తెగ టార్చర్ పెట్టాడు అంటూ అవి తింటున్నప్పుడు తనకు మరణం అంచులవరకు వెళ్ళిపోయిన ఫీలింగ్ కలిగిందని కామెంట్స్ చేసింది తమన్నా. అయితే తనకు అన్ని వెరైటీలు పంపిన ప్రభాస్ తాను డైటింగ్ చేస్తూ ఉండటంతో తనకు ఇష్టమైన రకరకాల ఫుడ్ ఐటమ్స్ ను తన పై ప్రయోగించి తన కసిని తీర్చుకున్నాడు అంటూ ప్రభాస్ పై సెటైర్లు వేసింది తమన్నా..


మరింత సమాచారం తెలుసుకోండి: