ఎనభైవ దశకంలో తన అందాలతో మురిపించి మై మరపించిన నటి గౌతమి. చిక్ బుకు చికు బుకు రైలే అంటూ జెంటిల్ మెన్ సినిమాలో ఓ ప్రత్యేక పాటలో గౌతమి అందాలు చూసి అందరూ ముగ్ధులైపోయారు.తెలుగు, తమిళ, మళయాల, హిందీ ఇలా దేశంలోని ప్రధాన సినీ పరిశ్రమల్లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి గౌతమి తర్వాత ఈమె కమల్ హాసన్ తో సహజీవనం చేస్తూ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. తాజాగా మళయాలం, తెలుగులో సూపర్ హిట్ అయిన దృశ్యం సినిమా తమిళ రీమేక్లో గౌతమి నటించారు.
పాపనాశనం సినిమాలో ఓ దృశ్యం
కమల్ హాసన్ హీరోగా జీతూ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో ఈ సినిమా ‘పాపనాశనం’ ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు చిత్ర యూనిట్ తెలిపారు. గౌతమి చాలా రోజుల తర్వాత మళ్లీ ముఖానికి రంగు వేసుకుంది తనలోని నటన ఏమాత్రం తగ్గలేదని తనకు ధీటుకు గా నటించింది కమల్ హాసన్ చెప్పారు. పాపనాశనం బాక్సాఫీస్ పరంగానూ మంచి విజయం సాధిస్తుందని కమల్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.