ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ అందరూ బిజిగా మారిపోయారు. ఎంత బిజిలా మారారు అంటే, ఓ రేంజ్ స్టార్ డం ఉన్న హీరోలకి సైతం, టాప్ హీరోయిన్స్ అందుబాటులోకి రావడం లేదు. దీంతో సెకండ్ స్టేజ్ హీరోయిన్స్ కి లక్కీ ఆఫర్స్ వరిస్తున్నాయి.
బంపర్ ఆఫర్స్ ని అందుకుంటున్న బ్యూటీ రెజీన కసాండ్ర
ఆ విధంగా బంపర్ ఆఫర్స్ ని అందుకుంటున్న బ్యూటీ రెజీన కసాండ్ర. అవును, ప్రస్తుతం ఇండస్ట్రీలోని స్టార్ హీరోలకి ఈ బ్యూటీ కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే హీరోయిన్. తాజాగా ఈ అమ్మడు స్టార్ హీరో సరసన ఆఫర్ ని చేజిక్కించుకుకొని ఫుల్ హ్యాపీ లో ఉంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ‘సాహసం’, ‘లౌక్యం’, ‘జిల్’ ఇలా వరుసగా హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న గోపీచంద్ తన తదుపరి సినిమా తనకు ‘యజ్ఞం’ రూపంలో తొలి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన ఎఎస్ రవికుమార్ చౌదరి డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాని ఇటీవలే అధికారికంగా లాంచ్ చేసారు. తాజా సమాచారం ప్రకారం చెన్నై బ్యూటీ రెజీన కసాండ్ర ని ఈ సినిమాలో గోపీచంద్ కి హీరోయిన్ గా సెలెక్ట్ చేసారని ఈ చిత్ర యూనిట్ లో క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. కెఎస్ రవికుమార్ చెప్పిన స్టొరీ లైన్, హీరోయిన్ రోల్ బాగా నచ్చడంతో, వెంటనే కాదనకుండా ఒప్పేసుకుంది. అంతే కాకుండా గత 3 సంత్సరాల నుండి గోపిచంద్ సరసన నటించాలని రెజీన ఎంతో ప్రయత్నించింది.
ఒకసారి ఛాన్స్ వచ్చిన చివరి నిముషంలో మిస్ అయిందట. కాని అనుకోని విధంగా ప్రస్తుతం తనకి ఈ ఆఫర్ రావడంపై ఫుల్ హ్యాపీగా ఉంది. అయితే తనకి కెఎస్ రవికుమార్ చెప్పిన కథ నచ్చినా, నచ్చక పోయినా... గోపిచంద్ హీరో కాబట్టి కళ్ళుమూసుకొని ఒప్పేసుకుంటానని బాహాటంగానే అంటుంది. గోపీచంద్ — రెజీన కాంబినేషన్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై 15 నుంచి ప్రారంభం కానుంది.