ఇండియన్ సినిమా  డ్రీంగర్ల్, బిజేపీ ఎంపీ హేమామాలిని రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు. రాజస్థాన్‌లోని  జైపూర్ వద్ద  హేమమాలిని కారు, మరొక కారును  ఢీ కొట్టుకున్న సంఘటనలో ఆమె తలకు పెద్ద గాయం అయ్యింది. ఆగ్రా నుంచి జైపూర్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 


హేమామాలిని తలకు దెబ్బ తగిలడంతో


ఈ ఘటనలో హేమామాలిని తలకు దెబ్బ తగిలడంతో ఆమెను జైపూర్ లోని ఫోర్టీస్ హాస్పిటల్ లో చేర్చారు. చికిత్స అందించిన వైద్యులు ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే వుందని  తెలిపారు. కాని మరి కొన్ని వైద్య పరీక్షలు ఆమెకు చేయాలని సూచించినట్లు గా తెలుస్తోంది. 

హేమమాలిని ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు


హేమమాలిని ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు ఎదురుగా వస్తున్న ఆల్టో కారును ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ఈ ప్రమాదంలో ఆల్టో కార్ లో ప్రయాణిస్తున్న రెండేళ్ల చిన్నారి అక్కడిక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి గాయాలవగా వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారువారి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. 

హేమమాలిని కనుబొమ్మ వద్ద తగిలిన గాయానికి కుట్లు వేసారు ఆమె వెన్నెముక, కాళ్ళకు కూడ గాయాలు అయ్యాయని డాక్టర్లు చెపుతున్నారు. ఈమధ్యనే హేమాలిని భర్త ధర్మేంద్ర ఆరోగ్యం పై వదంతులు వచ్చినప్పుడు హేమమాలిని ఖండించిన విషయం తెలిసిందే. ఈ విషయం జరిగిన కొద్దిరోజులకే హేమమాలినికి ప్రమాదం జరగడం యాదృచ్చికo అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: