ఈ మద్య తెలుగు హీరోలు తమ ఇమేజ్ సొంతానికి కాకుండా కాస్త ఇతర సినిమాలపై కూడా వాడుతున్నారు. ఈ సంవత్సరం తెలుగు ఇండస్ట్రీలో రెండు చారిత్రాత్మక భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. నిర్మాత,దర్శకులు గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చి దిద్దిన ‘రుద్రమదేవి’, ఎస్.ఎస్. రాజమౌళి రెండు సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమా ‘బాహుబలి’. అయితే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ యాక్షన్, లవ్, సెంటిమెంట్ సినిమాలు చూసి బోరుకొడుతున్న సమయంలో ‘మగధీర’ లాంటి సినిమా తీసి అందరి మనసు దోచారు రాజమౌళి. ఇదే తరహాలో జాన పద చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుందని తెలుసుకున్న దర్శక, నిర్మాతల ఇలాంటి సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు.

అనుష్క రుద్రమదేవి పోస్టర్


ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాకతీయ చరిత్ర లో రాణి రుద్రమదేవి ప్రధాన అంశంగా తీసుకొని నిర్మించిన 3D చిత్రం ‘రుద్రమదేవి’.  ఈ చిత్రం కోసం గుణశేకర్ శక్తికి మించిన ఖర్చు చేశారట అంతే కాదు ఈ సినిమా విజయం సాధించడం కూడా ఆయనకు చాలా ముఖ్యమని తెలుస్తుంది. వాస్తవానికి ‘రుద్రమదేవి’ మే నెలలోనే విడుదల కావాల్సింది కానీ కొన్ని గ్రాఫిక్స్ కారణంగా ఆలస్యం అవుతున్నట్లు చెబుతున్నాడు గుణశేఖర్. అయితే ఈ నెలలో బాహుబలి చిత్రం విడుదల కాబోతుంది ఇప్పటికే  ఈ సినిమాపై ఏ సినిమాలకు రాని హైక్ వచ్చింది. అయితే ఈ సినిమా ప్రభావం రుద్రమదేవి సినిమాపై ఉంటుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే రెండు కూడా జానపద చిత్రాలకు సంబంధించనవే కాబట్టి ఇలాంటి సినిమాలు ప్రజలు బాగానే ఆదరిస్తారు.

అల్లు అర్జున్ రుద్రమదేవి పోస్టర్


ఇక ఈ సినిమాకు కొత్త హంగులు దిద్దుతున్నాడు నిర్మాత గుణశేఖర్ ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో వాయిస్ ఓవర్ ఇప్పించాడు. ఇప్పుడు తన ఆప్తమిత్రుడు మహేష్ బాబు సహాయం తీసుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చాయి. ఈ సినిమా రిలీజ్‌కి దగ్గర పడినపుడు ప్రమోషన్‌కి తనవంతు చేయగలిగింది చేస్తానని మహేష్‌బాబు మాటిచ్చాడట. తనతో మూడు సినిమాలు తీసిన గుణశేఖర్‌పై వున్న ప్రత్యేక అభిమానంతో మహేష్‌ 'రుద్రమదేవి'ని ప్రమోట్‌ చేయడానికి ముందుకొస్తున్నాడు. నిజంగా మహేష్ బాబు సూపర్ స్టార్ పొజీషన్లో ఉండి కూడా సహ నటులకు సహాయ పడాలన్న గొప్ప మనసు ఉన్న వ్యక్తి ...తాజాగా బాహుబలి చిత్రం కోసం ‘శ్రీమంతుడు’ సినిమా పోస్ట్ పోన్ చేసుకున్నాడు. ఇప్పుడు రుద్రమదేవి సినిమా కోసం ప్రమోషన్లో పాల్గొనటం నిజంగా మహేష్‌ తన పెద్ద మనసు చాటుకుంటున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: