మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తల్లి సురేఖ  కోరిక నెరవేర్చడానికి ఒక సాహసం చేసినట్లు తెలుస్తోంది. ఆ సాహసానికి సంభందించిన ఫోటోలను చరణ్ తన పేస్ బుక్ లో పోస్ట్ చేసాడు. చరణ్ తల్లి సురేఖ ఎప్పటి నుంచో అమర్ నాథ్ లోని శివుడు ఆలయాన్ని దర్శించుకోవాలి అన్న కోరిక ఉందట. అంతే ఈ కోరిక తెలియగానే చరణ్ తన తల్లి కోరిక తీర్చడానికి అమరనాథ్ ఆలయాన్ని దర్శించి తన తల్లి మొక్కును తీర్చుకోవడమే కాకుండా 13 వేల అడుగుల ఎత్తులో హిమాలయాల్ మధ్యన ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకుని తన తల్లి కోరిక తీర్చినందుకు తనకు చాల ఆనందంగా ఉంది అంటూ తన ఫేస్ బుక్ లో ఆ ఫోటోలను పోస్ట్ చేసాడు. 

అయితే గత కొద్ది రోజులుగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఒక్కరోజు తీరిక లేకుండా ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న రామ్ చరణ్ ఆ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి ఇంత హడావిడిగా అమర్ నాథ్ ఆలయాన్ని దర్శించుకోవడం వెనుక ఏదైనా కారణం ఉందా అన్న వార్తలు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి. 

ఈ వార్తలు ఇలా ఉండగా ఆ మధ్య సోషల్ మీడియాలో బుల్లి ‘మగధీర’ గా నల్గొండ జిల్లాకు చెందిన పరశురాం అనే బుడతడు మగధీర చిత్ర క్లైమాక్స్ సన్నివేశాల డైలాగులను గుక్కతిప్పుకోకుండా చెప్పి చరణ్ దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఆ వీడియోను చూసి ఆ అబ్బాయిని కలిసిన చరణ్ అతడికి ఇచ్చిన మాట ప్రకారం బాగా చదువుకోవడానికి ఒక మంచి స్కూల్ లో  పరుశురామ్ ను చేర్పించిన ఫోటోలను కూడ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు. 

అంతేకాదు ఆ అబ్బాయి చదువు అయిపోయిన తరువాత అతడి కోరిక మేరకు హీరోని చేస్తాను అంటున్నాడు రామ్ చరణ్. ఇప్పుడు ఈ రెండు విషయాలకు సంబంధించిన ఫోటోలు వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: