పవన్ కళ్యాణ్ త్వరలో పెట్టబోతున్న ప్రెస్ మీట్ పై వెబ్ మీడియాలో కొందరు వేస్తున్న సెటైర్లు పవన్ దృష్టి వరకు వెళ్ళినా వెళ్ళాక పోయినా పవన్ అభిమానులను మాత్రం తీవ్రంగా కలిచి వేస్తున్నాయి. కొద్ది రోజుల క్రిందట తాజా రాజకీయ పరిస్థుతుల పై స్పందిస్తాను అంటూ పవన్ ట్విట్ చేసి తాను త్వరలో ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లు తెలిపాడు. 

అయితే ఈ విషయం జరిగి దాదాపు వారం రోజులు గడిచిపోతున్నా పవన్ నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో పవన్ ప్రెస్ మీట్ వ్యవహారం అటకెక్కింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడమే కాకుండా పవన్ ప్రస్తుతం నటిస్తున్న ‘గబ్బర్ సింగ్ 2’ సినిమాలాగే పవన్ ప్రెస్ మీట్ కూడ ఎప్పుడు జరుగుతుందో పవన్ కే తెలియదు అని కొందరు వెబ్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. 

ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్ట్ అయిన రేవంత రెడ్డి ఇప్పటికే బెయిల్ పై బయటకు రావడం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చoద్రబాబునాయుడు ఆంద్రప్రదేశ్ లో పెట్టుబడుల కోసం జపాన్ కు వెళ్ళబోతున్న నేపధ్యంలో ఎవరికీ వారు బిజీగా ఉండి కెసిఆర్ కూడ తన దూకుడును తగ్గించుకున్న నేపధ్యంలో ఇప్పుడు అన్నీ అయిపోయాక ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందుకు రావడం కంటే తన ప్రెస్ మీట్ ఆలోచనలను అటకెక్కించడమే మంచిది అంటూ సెటైర్లు పడుతున్నాయి. 

దీనితో ఈ కామెంట్స్ చూసిన పవన్ ఫ్యాన్స్ పవన్ స్పందించినా స్పందించక పోయినా విమర్శలు వెంటాడుతూనే ఉన్నాయి కాబట్టి స్పందించక పోవడమే మంచిది అంటూ తమలో తాము కామెంట్స్ చేసుకుంటున్నట్లు టాక్. మరి పవన్ తన అభిమానుల అభిప్రాయాలను  పరిగణలోకి తీసుకుంటాడో లేదో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: