రాజమౌళి భారీ బడ్జెట్ తో నిర్మించిన ‘బాహుబలి’ సినిమా గురించి ఇప్పటికే విపరీతమైన క్రేజీ వచ్చింది. మే నెలలో సినిమాలోని క్యారెక్టర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు వాటికి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా శివగామి గా రమ్యకృష్ణ పోస్టర్ కు చాలా మంచి స్పందన లభించింది. తర్వాత సినిమాకు సంబంధించిన ట్రైలర్స్ ను సాంగ్స్ ను విడుదల చేశారు, రెండు రోజుల క్రితం నుంచి చిత్రానికి సంబంధించిన డైలాగ్స్ విడుదల చేస్తున్నారు.

శివగామి ‘రమ్యకృష్ణ’ బాహుబలి పోస్టర్


తాజాగా రమ్యకృష్ణ  ‘వీళ్ల తిరుగుబాటుతో మహిష్మతికి మకిలి పట్టింది. రక్తంతో కడిగేయ్’ అంటూ ఆవేశంగా అంటున్న డైలాగ్‌ను విడుదల చేశారు.  అయితే శివగామి పాత్ర నెగెటివ్ అప్రోచ్ తో ఉంటుందా లేక పాజిటివ్ అన్నది తెలియాలంటే రిలీజ్ వరకు ఎదురు చూడాల్సిందే . రమ్యకృష్ణ చెబుతున్న డైలాగ్ ఇప్పుడు నెట్లో పెద్ద సంచలనమే అయ్యింది . ట్రెండ్ సెట్ చేసేలా ఉన్న శివగామి డైలాగ్ యు ట్యూబ్ లో పెలిపోతోంది . 



మరింత సమాచారం తెలుసుకోండి: