ప్రస్తుతం సమంత సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ గా ఫిల్మ్ కెరీర్ ని లీడ్ చేస్తుంది. ఇదిలా ఉంటే తన అప్ కమింగ్ చిత్రంలో, చిత్ర యూనిట్ కి షాకింగ్ ఇచ్చే పని ఒకటి చేసింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న భామ సమంత.
ఈ బ్యూటీ చేతిలో దాదాపు ఐదు చిత్రాలు ఉన్నాయి. వాటిల్లో నటిస్తూ తెగ బిజీగా వుంది. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి వెనకబడ్డ కుటుంబాల్లోని పిల్లల చదువుల కోసం ఆర్థిక సహాయాన్ని అందిస్తూ తన సేవా హృదయాన్ని చాటుకుంటోంది. అంతే కాకుండా తాజా తమిళ చిత్రం వీఐపి-2 చిత్ర యూనిట్కు 6 లక్షలు అందించి తమిళ చిత్రపరిశ్రమలో అందరిని ఆశ్చర్యంలో ముంచేసింది.
గతంలో ధనుష్, అమలాపాల్ జంటగా నటించిన తమిళ చిత్రం వీఐపి. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో దీనికి సీక్వెల్గా వీఐపి-2 చిత్రాన్ని వేల్రాజ్ రూపొందిస్తున్నారు. హీరో ధనుష్ నటిస్తూ నిర్మిస్తున్న వీఐపి-2 చిత్రం కోసం 120 మంది చిత్ర యూనిట్ సిబ్బంది పనిచేస్తున్నారు.
వీరి పనితనం నచ్చి ఒక్కొరికి ఐదువేల చొప్పున యూనిట్ అందరికి సమంతా ఆరు లక్షలు బహుమతిగా అందించడం తమిళ చిత్ర వర్గాలు విశేషంగా చెప్పుకుంటున్నాయి. వీఐపి-2 చిత్రంలో ధనుష్కు భార్యగా సమంతా నటిస్తోంది. ఆమెతో పాటు సెకండట్ హీరోయిన్ గా అమీ జాక్సన్ కనిపించనుంది.