ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజీ ఫిల్మ్ గా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్న మూవీ, అఖిల్ డెబ్యూ ఫిల్మ్. ఈ మూవీని పరిమిత బడ్జెట్ మొదలు పెట్టిన నిర్మాతలు, ఇప్పుడు ఆ బడ్జెట్ మితిమీరిపోయిందనే టాక్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అయితే అఖిల్ పై అంత భారీ బడ్జెట్ పెట్టడం అనేది, నాగార్జునకి సైతం అంతగా ఇష్టం లేనట్టుగా ఉందని ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.
దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, అక్కినేని అఖిల్ను హీరోగా పరిచయం చేస్తూ, ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం థాయ్ల్యాండ్లో ఓ షెడ్యూల్ స్టార్ట్ చేసిన అఖిల్ సినిమా టీమ్ ఆ షెడ్యూల్ను నేడు పూర్తి చేసింది. ఇక దీంతో 70% పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన భాగమంతా మరికొన్ని నెలల్లో పూర్తి కానుంది.
అక్కినేని వంశంలో మూడో తరంలో పరిచయమవుతోన్న అఖిల్ సినిమాపై మొదట్నుంచీ భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా రూపొందుతున్నట్లు నితిన్, వి.వినాయక్ చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే! తాజాగా తనపై చూపుతున్న ప్రేమకు అఖిల్ అభిమానులకు ఓ లేఖ కూడా రాసి వారిని ఆనందింపజేశారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి మొదట అనుకున్న బడ్జెట్ 23 కోట్ల రూపాయలు.
కాని పెరిగిన బడ్జెట్ కారణంగా మూవీ పూర్తైయ్యే లోపు అయ్యే బడ్జెట్ దాదాపు 38 కోట్ల రూపాయలు. ఈ లెక్కలను చూసిన నాగార్జున, మితిమీరిన బడ్జెట్ కారణంగా అటు అటు నిర్మాత నితిన్, ఇటు కొడుకు అఖిల్ పై ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది.