సినిమా ధియేటర్ల ముందు తమ అభిమాన హీరోల భారీ కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేసిన సీన్స్ ఇప్పటి వరకు చూసాము. కానీ ‘బాహుబలి’ విడుదలరోజున ప్రభాస్ పోస్టర్స్ పట్టుకుని 2000 ల మోటారు బైక్స్ తో ముందు రెండు ఏనుగులు, 50 గుర్రాలను పెట్టుకుని భీమవరంలో ‘బాహుబలి’ విడుదల రోజున ప్రభాస్ అభిమానులు తలపెట్టిన ర్యాలి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ ఊరేగింపు మధ్య ప్రభాస్ నామ స్మరణ చేస్తూ అభిమానులు భీమవరం పట్టణాన్ని హోరు ఎత్తిస్తారని టాక్. జూలై 10న భీమారంలోని ప్రధాన ప్రాంతాలలో ఈ ఉరేగిoపు నిర్వహించి ప్రభాస్ అభిమానులు ‘బాహుబలి’ ప్రదర్శించే థియేటర్స్ కు చేరుకుంటారని తెలుస్తోంది. అయితే ఈ ఊరేగింపుకు సెక్యూరిటీ ఏ స్దాయిలో ఎలా ఇవ్వాలి అనే దానిపై అధికార వర్గాలలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
పోలీసులు ఈ ర్యాలికి ఇప్పటికే పర్మిషన్ ఇచ్చినా జంతువులను ఈ ఊరేగింపులో ఉపయోగిస్తే జంతు పరిరక్షణ సంఘాలనుండి సమస్యలు వస్తాయి కాబట్టి జంతువులు లేకుండా ఈ ఊరేగింపును నిర్వహిoచుకోమని అధికారులు చెప్పినా రాజకీయ వర్గాల స్థాయిలో ఈభారీ ర్యాలీకి ఎటువంటి అడ్డంకులు అభిమానులకు చెప్పవద్దని ఆదేశాలు అందుతున్నట్ట్ల్లు తెలుస్తోంది.
ఇప్పటికే ‘బాహుబలి’ విడుదల క్రేజ్ తో ఇరురాష్ట్రాలలోని అన్ని ప్రాంతాల అభిమానులు జోర్ అందుకున్న నేపధ్యంలో ఈ భారీ ఊరేగింపు వార్తలు ప్రభాస్ అభిమానులకు మరింత జోష్ ను ఇస్తున్నాయి. దీనిని బట్టి చూస్తూ ఉంటే ఇక రానున్న రోజులలో టాప్ హీరోల సినిమాల పబ్లిసిటీకి మూగ జీవాలను రంగంలోకి దింపే సాంప్రదాయానికి బాహుబలి శ్రీకారం చుట్టింది అనుకోవాలి..