ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్స్ తో మూవీలను తీసి, బ్లాక్ బస్టర్స్ ని కైవసం చేసుకోవాలని చూస్తుంటే.. ఓ హీరో మాత్రం లెజండ్రీ డైరెక్టర్ కాంబినేషన్ లో హిట్ తో సంబంధంలేకుండా నటించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ‘సాగర సంగమం’, ‘స్వాతి ముత్యం’, ‘సిరివెన్నెల’, ‘స్వయం కృషి’, ‘శుభ సంకల్పం’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెలుగు ప్రేక్షకులను అందించిన లెజండ్రీ డైరెక్టర్ కె. విశ్వనాధ్.

రీసెంట్ గా జరిగిన ఓ వేడుకలో విశ్వనాథ్ మాట్లాడుతూ తనకి అవకాశం దొరికితే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ని డైరెక్ట్ చెయ్యడానికి సిద్దంగా ఉన్నానని తెలిపాడు. అలాగే మాట్లాడుతూ గతంలో చాలా మంది నిర్మాతలు ఎన్.టి.ఆర్ తో సినిమా చెయ్యడానికి తనని కలిసారని తెలిపాడు.

ఆయన గత సినిమాల రీమేక్ టాపిక్ గురించి మాట్లాడుతూ ‘నేను తీసిన ఏ సినిమాని మళ్ళీ ఇప్పుడు రీమేక్ చెయ్యాలని అనుకోవడం లేదు. అవి క్లాసిక్స్. ఇప్పుడు వాటిని తీస్తే ఇప్పటి ఆడియన్స్ అంచనాలను అందుకునేలా ఉండవని’విశ్వనాధ్ తెలిపాడు. అయితే జూనియర్ సైతం విశ్వనాధ్ గారి డైరెక్షన్ లో నటించటానికి సిద్ధపడ్డాడు. సుకుమార్ మూవీ అనంతరం విశ్వానాధ్ గారి కాంబినేషన్ మూవీ దాదాపు ఓకే అయినట్టే అని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.

దీనికి సంబంధించిన సమాచారం త్వరలోనే తెలియనుందని క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి జూనియర్ తీసుకున్న ఈ నిర్ణయానికి బడా హీరోలు అంతా అవాక్కవుతున్నారంట. అక్కడి రిపోర్టర్స్ ఆటోబయోగ్రఫీ రాస్తున్నారా అని అడిగితే ‘పెద్దగా నవ్వి నేను ఎలాంటి ఆటోబయోగ్రఫీ రాయడం లేదని’ తెలిపాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: