టౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్స్ కి అటు హీరోయిన్ గా ఆఫర్స్ ఎన్ని వస్తుంటాయో, మరో వైపు స్పెషల్ ఎప్పిరియన్స్ అంటూ వచ్చే ఆఫర్స్ కూడ అలాగే ఉంటాయి. తాజాగా కరీనాకపూర్ బిటౌన్ అప్ కమింగ్ మూవీలో హాట్ హాట్ గా కనిపించబోతుంది.
ఇందుకుగానూ తను ఏకంగా 2 కోట్ల రూపాయలను తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే,కరీనా కపూర్ ఓ ఐటం సాంగ్ లో అదరకొట్టనుంది. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సిద్ధార్థ్ మల్హోత్రా ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం 'బ్రదర్స్'. ఇందులో కరీనా కపూర్ ఖాన్ 'మేరా నామ్ మేరీ' అనే ఓ ఐటం సాంగ్లో కనిపించనుంది.
అయితే ఈ సాంగ్ కోసం దాదాపు 2 కోట్ల రూపాయలను తీసుకుంది. కేవలం 3 నిముషాల పాటు ఉంటే ఈ సాంగ్ లో కరీనా కనిపించినందుకు ఈ రేంజ్ రెమ్యునరేషన్ అనేది ఎక్కువే అని బిటౌన్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కరీనా కపూర్ ట్రెండ్ బిటౌన్ లో అంతగా లేకపోయినా, తనకి ఎందుకింత రెమ్యునరేషన్ అంటూ, బ్రదర్స్ ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహాన్ ని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే కరీనాకపూర్ గతంలోనూ ... ఫెవికాల్సే లాంటి ఐటమ్ సాంగ్స్తో ఆకట్టుకుంది.
ఇప్పుడు ఈ మేరీ పాటతో బాలీవుడ్ ఇండస్ట్రీనే ఓ వూపువూపేసే పనిలో ఉంది. ఈ పాటకి కొరియోగ్రఫీ చేసిన గణేశ్ ఆచార్య దీనిని2015 చికినీ చమేలీగా పేర్కొంటున్నారు. ఈ చిత్రం 2011లో వచ్చిన హాలీవుడ్ చిత్రం'వారియర్'కి రీమేక్. ధర్మా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా,అక్షయ్ కుమార్, జాక్వెలీన్ ఫెర్నాండెజ్,జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.