ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త యాక్టర్ ఎంట్రి ఇచ్చి, హాట్ హాట్ గా సినీ పెద్దలను రెచ్చగొడుతుంది. తను మరెవ్వరో కాదు. బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న యాంకర్ రేష్మి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, యాంకర్ రెష్మి ఇప్పుడు పూర్తిస్థాయిలో వెండితెరపై కన్నేసింది.

అడపాదడపా తెలుగు, తమిళం సినిమాల్లో నటిస్తున్న ఈమె, ఏకంగా ఐటమ్‌సాంగ్‌కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. తాజాగా విడుదలైన ‘బస్తీ’చిత్రంలో ఈ బ్యూటీ స్పెషల్‌గా కనిపించింది. కొద్దిరోజుల వరకు గ్లామర్ పాత్రలకే పరిమితమైంది ఈ అమ్మడు, షడన్ గా స్పెషల్ సాంగ్ వైపు ఎందుకు మొగ్గుచూపించడంతో, ఇండస్ట్రీ మేకర్స్ సైతం ఈ బ్యూటీపై ఓ కన్నేశారు.

ఎందుకంటే రేష్మి లోనూ చాలా ఫైర్ ఉందని ఫిల్మ్ మేకర్స్ అంటున్నారు. దశాబ్దం కిందటే గ్లామర్ ఇండస్ర్టీలోకి అడుగుపెట్టిన రేష్మికి సరైన ఆఫర్లు రాలేదు. ఈ క్రమంలో బుల్లితెరపై కామెడీ షోలతో ప్రేక్షకులకు దగ్గరైంది. అంతేకాదు వేలల్లో అభిమానులను సంపాదించుకుంది. ఓ వైపు యాంకర్‌గా,మరోవైపు నటిగా, ఇంకోవైపు ఐటెమ్ బ్యూటీగా ప్రేక్షకులకు మరింత దగ్గరైందన్నమాట. 

అయితే తను చేసే ఐటెం సాంగ్స్ కి రెమ్యునరేషన్ మాత్రం ప్రస్తుతానికి 30 లక్షలు తీసుకుంటుందట. ఇక క్రేజ్ పెరిగేకొద్ది రెమ్యునరేషన్ పెరిగే ఛాన్స్ ఉందని అంటుంది. అందుకే ఈ అమ్మడి డేట్స్ బుక్ చేసుకోవడం కోసం చాలా మంది నిర్మాతలు పోటీ పడుతున్నట్టగా తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: