తెలుగు ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో ప్రభాస్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘చత్రపతి’ సినిమా తర్వాత మాస్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ‘డార్లింగ్,మిస్టర్ పర్ ఫెక్ట్’ తర్వాత అమ్మాయిల కలల రాజుగా మారిపోయాడు. మిర్చి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. కానీ ఇక్కడే వచ్చింది చిక్కు మిర్చి సినిమా తర్వాత వెంటనే మరో సినిమా వస్తుందని ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు,  కానీ వాళ్ల ఆశలు నిరాశలే అయ్యాయి.

బాహుబలి పోస్టర్


మిర్చి సినిమా తర్వాత దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ప్రభాస్ మళ్లీ తెరపై కనిపించ బోతున్నాడు. దీంతో రెండున్నర సంవత్సరాలుగా వాళ్ళకు సినిమా ఇవ్వకుండా విలువైన కాలాన్ని బాహుబలి కి కేటాయించిన ప్రభాస్ మరోసారి తనని క్షమించాల్సిందిగా అభిమానులను కోరారు. సంవత్సరంన్నరలో కంప్లీట్ అవుతుందనుకున్న సినిమా దాదాపు రెండున్నరేళ్లు పట్టింది. కానీ తెలుగు ఇండస్ట్రీలో ఓక ప్రతిష్టాతక్మక చిత్రంగా రూపొందిందని చరిత్రలో మిగిలిపోయే చిత్రంగా ఉంటుందని ప్రభాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: