గోపాల గోపాల సినిమా తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది పవన్ కళ్యాన్ తెరపై కనిపించడానికి.. అయితే ఈ మద్యలో కొన్ని రాజకీయలు, ఫంక్షన్లు లాంటి వాటితోనే గడిచిపోయింది. ఇప్పుడు గబ్బర్ సింగ్ 2 తో షూటింగ్ లో బిజీ బిజీ గా గడుపుతున్నాడు పవన్. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అప్పుడే అమ్మేశారట..అవును ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ కు 63కోట్లకు అన్ని హక్కులను కలిపి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూణేలో జరిగింది.
 

 ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ 


 పవన్ కళ్యా స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అప్పుడే అంత డిమాండా అంటే .. నిజమే గబ్బర్ సింగ్ ఫస్ట్ సినిమా ఆరేంజ్ లో ఊపేసింది. మరి దాని సీక్వేల్ గా వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ డిమాండ్ ను బట్టి సినిమా మొత్తాన్ని ఈరోస్ కు అమ్ముకోవడంతో ఇక త్వరగానే గబ్బర్ సింగ్ 2ని ఫినిష్ చేసే పనిలో ఉన్నారట.



మరింత సమాచారం తెలుసుకోండి: