తెలుగు ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం తర్వాత ఆయనకు కొంత కాలం గ్యాప్ వచ్చింది. అగ్ర హీరోలతో సినిమాలు అంటే పవన్, మహేష్, బన్ని లాంట వాళ్లతోనే ఇప్పటి వరకు సినిమాలు తీశారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అంతా బిజీ షెడ్యూల్స్ తో గడిపేస్తున్నారు. దీంతో  హీరో నితిన్ ను త్రివిక్రమ్ డైరెక్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించే చిత్రం ఫైనల్ అయ్యినట్టే. అయితే పూరీ జగన్నాధ్ సినిమాలో నితిన్ నటించ బోతున్నట్లు ఆ మద్య వార్తలు వినిపించాయి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది క్యాన్సల్ అయిపోయింది.

హీరో నితిన్, దేవి శ్రీ ప్రసాద్, త్రివిక్రమ్


త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన ఔట్ అండ్ ఎంటర్ టైనర్ నితిన్ కు తెగ నచ్చేసింది.త్రివిక్రమ్ నితిన్ కాంబినేషన్ లో తెరకెక్కించబోయే చిత్ర షూటింగ్ జులై 20నుంచి మొదలు కానుందట. దాదాపు 50 రోజుల పాటు షూటింగ్ చేయనున్నారు. ప్రస్తుతం చిత్ర హీరోయిన్స్, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గాన్ని ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నారట. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తారట చిత్ర యూనిట్.


మరింత సమాచారం తెలుసుకోండి: