ప్రస్తుతం  ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న అప్ కమింగ్ శ్రీమంతుడు హాట్ టాపిక్ మారింది. టాలీవుడ్ లో బాహుబలి మూవీ రిలీజ్ అవుతున్నా, దానికి పోటీగా శ్రీమంతుడు మూవీ సైతం బరిలోకి దిగిందంటే, మహేష్ పవర్ ఏంటో అప్పుడే అర్ధం చేసుకోవాలి. అయితే ఇలా రెండు పెద్ద మూవీలో ఒకేసారి పోటీపడితే, ఇద్దరికి నష్టం అనుకున్న మహేష్, శ్రీమంతుడు విడుదలను పోస్ట్ ఫోన్ చేసుకున్నాడు.

అయితే త్వరలోనే శ్రీమంతుడు మూవీ ఆడియో వేడుక జరగనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే, సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న‘శ్రీమంతుడు’ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీస్ పతాకంపై రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ముందు ప్రకటించినట్లుగానే ఈనెల 18న దేవీశీప్రసాద్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోను రిలీజ్ చేయనున్నారు. ఇందుకు వేదికగా హైద్రాబాద్‌లోని శిల్పకళావేదికని ఎంచుకున్నారు. దేవీశ్రీ అందించిన ఆడియోతో పాటు థియేట్రికల్ ట్రైలర్ కూడా ఆడియో రిలీజ్ సందర్భంగా విడుదల కానుంది.

ఇక సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన విడుదల చేసిన పోస్టర్, టీజర్‌లు సినిమాపై విపరీతమైన అంచనాలను పెంచేయగా, అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని దర్శకుడు కొరటాల శివ చెబుతూ వస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 7న భారీ ఎత్తున విడుదల కానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: