గత వారం అమెరికాలో జరిగిన ప్రవాసాంధ్రుల తానా, నాట్స్ సంస్థల సాంస్కృతిక వేడుకలకు టాలీవుడ్ నుండి ఎందరో హీరోలు, హీరోయిన్స్ ను అతిధులుగా పిలిచిన విషయం తెలిసిందే. వీరికోసం ఈ సంస్థలు భారీగానే ఖర్చు కూడ పెట్టాయి. ఈ నేపధ్యంలో యుఎస్ లోని ఒక వేడుక కోసం టికెట్లు సేల్ కాకపోతే రకుల్ ప్రీత్ సింగ్ వస్తుందనే సంగతిని పాస్ చేయగానే టికెట్లు హాట్ కేకుల్లా సేల్ అయిపోయిన సంఘటన అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
టాప్ యంగ్ హీరోలకే కాదు రకుల్ క్రేజ్ అమెరికాలోని తెలుగువారిని కూడ ఎంత షేక్ చేస్తోందో ఈ సంఘటన ఉదాహరణగా నిలిచింది. ఈ ఈవెంట్ కు అతిధిగా రావడానికి రకుల్ కు కోటి రూపాయలు గిఫ్ట్ గా ఇవ్వడానికి ఆ సంస్థ నిర్వాహకులు సిద్ధ పడటంతో ఆ డబ్బును రాబట్టాలి అంటే రకుల్ తో ఒక సెల్ఫీ దిగే ఛాన్స్ వుంటుందని ప్రచారం చేయడంతో అమెరికాలోని తెలుగు యూత్ డాలర్లను కురిపిoచారని టాక్.
రకుల్ ప్రీత్ రావడం వల్ల ఆ కార్యక్రమానికి సంబంధించిన టిక్కెట్లు అన్నీ అయిపోవడంతో ఆ సంస్థ నిర్వాహకులు రకుల్ కు కోటి రూపాయలు ఇచ్చినా నష్టం కలగలేదు అని కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిని బట్టి చూస్తూ ఉంటే అమెరికాలోని తెలుగు సంస్థలు ఏ కార్యక్రమాలు భవిష్యత్తులో చేసినా డొనేషన్స్ గురించి ఇబ్బంది పడకుండా ఒక్క రకుల్ ను నమ్ముకుంటే వారు గట్టెక్కినట్లే అనుకోవాలి.
ఇంత క్రేజ్ ఉంది కాబట్టే టాప్ యంగ్ హీరోలు అంతా రకుల్ ఇచ్చే డేట్స్ ను బట్టి తమ డేట్స్ ను సద్దుబాటు చేసుకుంటూ నడుస్తున్నారు అంటే రకుల్ ప్రీత్ ప్రస్తుతం టాలీవుడ్ మహారాణి లా ఎలా గుర్తింపు వచ్చిందో అందరికీ అర్ధం అవుతుంది..