తెలుగు ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘బాహుబలి’ చిత్రం రెండు పార్ట్ లుగా రూపొందుతున్న విషయం తెలిసిందే.. జూలై 10 న ‘బాహుబలి- ది బిగెనింగ్’ విడుదలకు సిద్దంగా ఉంది. తదుపరి భాగం గురించి అందరికీ అప్పుడై ఆసక్తి మొదలైంది. అయితే ‘బాహుబలి’ మొదటి భాగం గురించి రాజమౌళి చెబుతు ఈ చిత్రానికి ఆదరణ వస్తుందని అనకున్నాను కానీ ఇంతగా వస్తుందని అనుకోలేదు. ఇప్పటి వరకు ఏ సినిమాకు రాని ప్రచారం ఈ సినిమాకు వచ్చిందని వారి నమ్మకాలకు దగ్గట్టే ఈ సినిమా ఉంటుందని జక్కన్న అన్నారు. అయితే బాహుబలి రెండవ భాగం ఇప్పటికే నలభై శాతం పూర్తయ్యిందని మిగతా 60 శాతం త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. 


బాహుబలి చిత్రంలో రానా


 ఫస్ట్ పార్ట్ లో  ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితర భారీ తారాగణం నటిస్తున్నారు. ఇక సెకండ్ పార్ట్ లో ఓ కీలక పాత్రలో తమిళ స్టార్ సూర్యను తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి,దీనిపై జక్కన్న స్పిందిస్తూ సెకండ్ పార్ట్ కోసం సూర్యను తీసుకున్నామనే వార్తల్లో నిజంలేదని చెప్పేసారు. ఫస్ట్ పార్ట్ లోని తారాగణంతోనే సెకండ్ పార్ట్ కూడా ఉంటుందట అంటూ క్లారిటీ ఇచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: