మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ నిర్ణయం వెనుక ‘బాహుబలి’ రికార్డులు చాలా వ్యూహాత్మకంగా పనిచేసాయి అనే మాటలు వినిపిస్తున్నాయి. శ్రీనువైట్ల దర్శకత్వoలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలో  15 నిమిషాల అతిథి పాత్ర చేయడానికి చిరూ ఇంచుమించు తన అంగీకారాన్ని తెలిపడం వెనుక ఇప్పటివరకు తన మెగా ఫ్యామిలీకి  కోటలా కొనసాగుతున్న తమ కుటుంబ టాలీవుడ్ రికార్డులను రక్షించుకోవడానికే అన్న మాటలు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్ కలెక్షన్స్ రికార్డుల పర్వానికి చిరంజీవి మెగా స్టార్ గా శ్రీకారం చుడితే ఆ వారసత్వాన్ని రామ్ చరణ్ పవన్ లు తమ సినిమాల బ్లాక్ బస్టర్ హిట్స్ ద్వారా కొనసాగిస్తూ వచ్చారు. ఇలా ఎన్నో సంవత్సరాలు కొనసాగిన తమ మెగా కుటుంబ కలెక్షన్స్ ఆధిపత్యం ‘బాహుబలి’ రికార్డులతో బ్రేక్ కావడంతో బయటకు చెప్పక పోయినా చిరంజీవికి షాకింగ్ గా మారింది అని టాక్.

దీనితో చిరంజీవి సన్నిహితులు కొందరు చిరంజీవి మెగా స్టార్ గా కొనసాగుతున్న సమయంలో ప్రారంభించాలి అనుకున్న ‘బాగ్దాద్ దొంగ’ పర్షియన్ జానపద సినిమా కథను ఇప్పటి పరిస్థుతులకు అనుగుణంగా మార్చి చిరంజీవి 150వ సినిమాగా తీస్తే బాగుంటుంది అన్న సూచనలు చేసారని టాక్. అయితే ప్రస్తుత చిరంజీవి వయస్సు రీత్యా పరిస్థుతుల రీత్యా అది జరగని పని కాబట్టి ఆలోటును చిరంజీవి తాను ఒక అతిథి పాత్రను రామ్ చరణ్ శ్రీనువైట్లల సినిమాలో చేయడం ద్వారా మెగా అభిమానులకు జోష్ కలిగించే ఆలోచనలు సీరియస్ గా చేస్తున్నట్లు టాక్.

ఈ ప్రయత్నం ద్వారా రామ్ చరణ్ లేటెస్ట్ సినిమాకు క్రేజ్ మరింత పెరగడమే కాకుండా తన మెగా అభిమానుల సహకారంతో మళ్ళీ తన కుటుంబ టాలీవుడ్ రికార్డులను రక్షించుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ప్రయత్నాలు ఎంత వరకు వాస్తవ రూపం దాలుస్తాయో ఊహించలేకపోయినా ఏదోవిధంగా మెగా కుటుంబం ‘బాహుబలి’ టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేయడానికి తమవంతు ప్రయత్నాలను సీరియస్ గానే చేస్తోంది అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: