ప్రస్తుతం టాప్ యంగ్ హీరోలు నటిస్తున్న సినిమాల సంఖ్య తక్కువగా ఉన్నా వారికి వచ్చే పారితోషికం 10 కోట్ల పైన స్థాయిలో ఉండటoతో ఆ డబ్బును చాలా తెలివిగా ఇన్వెస్ట్ చేస్తూ తమ క్రేజ్ తో పాటుగా తమ ఆర్ధిక స్థాయిని కూడ రోజు రోజుకు పెంచుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే కోలీవుడ్ బాలీవుడ్ హీరోల కన్నా మన టాలీవుడ్ యంగ్ హీరోల ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్స్ అందర్నీ ఆశ్చచర్య పరుస్తున్నాయి. 

ఈ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్స్ లో  వెండితెర మన్మధుడు నాగార్జున నెంబర్ వన్ స్థాయిలో కొనసాగుతూ ఉంటే అతడి బాటను టాలీవుడ్ కు చెందిన టాప్ యంగ్ హీరోలు చాలామంది అనుసరిస్తున్నారు. ఈ లిస్టులో  రామ్ చరణ్, మంచు విష్ణు  ముందు వరుసలో ఉంటే వీరందరినీ  మించిపోతూ జూనియర్ ఎన్టీర్ కు సంబంధించిన రియల్ ఎస్టేట్ బిజినెస్ సీక్రెట్స్ ఇప్పుడు టాపిక్ అఫ్ టాలీవుడ్ గా మారాయి. 

ఫిలింనగర్ లో  వినపడుతున్న వార్తల ప్రకారం భాగ్యనగరానికి చెందిన ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్మించే ప్రతీ  అపార్ట్ మెంట్  వెంచర్ లో ఒక మంచి అపార్ట్ మెంట్ జూనియర్ గత కొద్దికాలంగా కొంటున్నాడని టాక్. ఇప్పటివరకు జూనియర్ భాగ్యనగరంలో 20 విలాసవంతమైన అపార్ట్ మెంట్స్ ను కొన్నాడని టాక్ . ఫిలింనగర్ వినపడుతున్న వార్తల ప్రకారం ఇప్పుడు వీటి విలువ దాదాపు 50 కోట్ల పైనే ఉంటుంది అనే మాటలు వినిపిస్తున్నాయి. 

ఈ వార్తలు ఎంత వరకు నిజమో అన్న విషయమై క్లారిటీ లేకపోయినా ఒకనాటి టాలీవుడ్ అందాల నటుడు శోభన్ బాబు బాటలో పయనిస్తున్న జూనియర్ వ్యూహాత్మక బిజినెస్ ప్లాన్ బట్టి రాబోతున్న రోజులలో జూనియర్ టాలీవుడ్ రియల్ ఎస్టేట్ టైకూన్ గా మారిపోయినా ఆశ్చర్యం లేదు అన్న సెటైర్లు పడుతున్నాయి. సినిమాలు తీసి ప్రయోగాలు చేయకుండా గతంలో శోభన్ బాబు అనుసరించిన మార్గంలో నేటి యంగ్ హీరోలు పయనించడం బట్టి నేటి యంగ్ హీరోలుఎంత ముందు చూపుతో ఉన్నారో అర్ధం అవుతుంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: