క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరుగాంచిన దేవిశ్రీప్రసాద్ సినిమాల ఆడియో ఫంక్షన్స్ లో అదేవిధంగా ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్స్ లో స్టేజ్ షోలు ఇస్తున్నప్పుడు ఒక పూనకం వచ్చిన వ్యక్తిలా ఊగిపోతూ స్టేజ్ పై డాన్స్ లు చేయడమే కాకుండా ఆపూనకం వల్ల చాల ఆయాస పడతాడు. 

గతవారం హైదరాబాద్ లో జరిగిన మాటివి అవార్డ్స్ నైట్ లో దేవిశ్రీప్రసాద్ చేసిన స్టేజ్ షో విపరీతమైన హడావిడి చేసింది. తన సూపర్ హిట్ సాంగ్స్ ను పాడుతూ దానికితోడు డాన్సులు కూడ చేస్తూ మాటివి అవార్డ్స్ ఫంక్షన్ లోని వాతావరణాన్ని జోష్ గా మార్చేశాడు. 

అసలే మాస్ పాటలు ఆపాటలకు దేవిశ్రీ స్టెప్స్ తో దంచికోడుతూ పనిలో పనిగా తనపక్కన డాన్స్ చేస్తున్న కత్తి లాంటి డాన్సర్లతో స్టేజ్ పైనే చేసిన హంగామాని చూసినవారు దేవిశ్రీ సరసంలో మరీ ఘాటు పెరిగి పోయింది అని సెటైర్లు వేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఆమధ్య జరిగిన ‘శ్రీమంతుడు’ ఆడియో వేడుకకు స్టేజ్ పై హంగామా చేసినందుకు ఆసినిమా నిర్మాతల నుండి తనకు సంగీత దర్శకుడిగా వచ్చే పారితోషికంతో పాటుగా అదనంగా 20లక్షలు తీసుకున్నాడు అన్నవార్తలు వస్తున్న నేపధ్యంలో మాటివి అవార్డ్స్ నైట్ లో ఇలా నలుగురు భామలతో దేవిశ్రీ చేసిన హడావిడికి ఇంకెంత మొత్తాన్ని మాటివి యాజమాన్యం నుండి పిండేసాడో అంటూ మరికొందరు కామెంట్స్ చేసుకున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: