తెలుగు ఇండస్ట్రీలో దాదాపు ఎనిమిది సంవత్సరాలు తన అందాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నటి కాజల్. ఇప్పుడు ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పనుందా ..? మరి దీనికి కారణం ఏమిటో అంటే పారితోషికం ..? పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం కావడం..? ఈ రెండింటిలో ఏది జరిగినా ఆశ్చర్య పోనక్కరలేదు. కాజల్ వచ్చిన కొత్తలో మామూలుగానే ఉన్నా మగధీర సినిమా తర్వాత ఈ  అమ్మడి క్రేజీ విపరీతంగా పెరిగిపోయింది.

ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే అప్పట్లో 50 నుంచి 80 లక్షలపై ఉంటే..ఇప్పుడు కోటిన్నర డిమాండ్ చేస్తుంది. అంతే కాదు ఈ అమ్మడికి కోలీవుడ్, బాలీవుడ్ లో సైతం చాన్సులు రావడంతో తెలుగు ఇండస్ట్రీపై చూపు తగ్గినట్లు సమాచారం. అంతే కాదు  'టెంపర్' సినిమా తర్వాత మరో చిత్రం చేయని ఈ అమ్మడు నేటి త‌రం హీరోయిన్స్ తో స‌మానంగా పోటీ ప‌డ‌లేక‌పోతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక పారితోషికంను కోటిన్నర కన్నా తగ్గించనని ఖచ్చితంగా చెప్పడంతో కాజల్ దగ్గరికి రావటానికి నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

కాజల్ అగర్వాల్


తమిళంలో మాత్రం సుమారుగా 70 నుంచి 80 లక్షలు తీసుకుంటున్న ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీలో మాత్రం కోటికి పైమాటే అంటుంది. ఇకపోతే తెలుగు ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లు రకూల్ ప్రతిసింగ్, రాశీఖన్నా,రెజీనా లాంటి కొత్త హీరోయిన్లు తమ గ్లామర్ తో మాంచి ఊపులో ఉన్నారు. దీంతో  తెలుగు స్టార్ హీరోలు ఎవరూ కాజల్ కి అవకాశాలు ఇవ్వడం లేదు కనుకే అటు వైపు చూస్తోందని టాక్. ఇక పోతే కాజల్ కి పెళ్లి ప్రయత్నాలు కూడా చేస్తున్నారట ఇంట్లో వాళ్లు మరి అదే గనక జరిగితే సినిమా ఇండస్ట్రీకీ గుడ్ బై చెప్పే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు సినీ విశ్లేషకులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: