ఈ మద్య తెలుగు హీరోలు సమాజ సేవలో బాగా పాల్గొంటున్నారు. తమ అభిమానులను ఆనంద పరచడానికి తామె స్వయంగా వెళ్లి వారి బాగోగులు తెలుసుకొని బహుమతులు ఇచ్చి సంతోష పరుస్తున్నారు. ఈ కోవలో పవన్ కళ్యాన్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి హీరోలు తమ అభిమానులను కలిసి సంతోష పరిచారు. తాజాగా యువరత్న నందమూరి బాలకృష్ణ ఓ అభిమానిని కలవడంతో ఆమె అభిమానానికి ఆవధులు లేకుండా పోయాయి.

విషయానికి వస్తే.. హైదరాబాద్ లోని గోపాలంపల్లి అక్కడి మంజీరా అపార్ట్ మెంట్స్ సమీపంలో బాలకృష్ణ  'డిక్టేటర్' షూటింగ్ జరుగుతుంది. ఇక్కడ కొన్ని కీలక దృశ్యాలు దర్శకుడు శ్రీవాస్ చిత్రీకరిస్తున్నారు. అయితే చాలా సేపు షూటింగ్ జరిగిన తర్వాత కాస్త విశ్రాంతి తీసుకుందాం అనుకున్న బాలయ్యకు ఓ విషయం తెలిసింది. ఓ తొంబై సంవత్సరాల వృద్దురాలు తనను చూడాలనుకొంటుందని కానీ ఆమె నడిచి వచ్చే స్థితిలో లేదు మరి బాలయ్య అక్కడికి వెళ్తాడా అన్న సందేహం అందరికీ వచ్చింది  ఆ సందేహాలకు తెరదించారు బాలయ్య. ఆ వృద్దురాలు స్వస్థలం విజయవాడ పేరు విజయ వృత్తి లాయర్ రిటైర్ అయిన తర్వాత తన చిన్న కూతురు వద్ద ఉంటుంది.

తన అభిమానిని కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్న బాలకృష్ణ


 స్వతహాగా ఎన్టీఆర్ వీరాభిమాని అయిన విజయకు తన అపార్ట్ మెంట్ దగ్గర బాలయ్య షూటింగ్ చేస్తున్న విషయం తెలిసింది. బాలయ్యను చూడాలనుకు నే కోరికను కుటుంబ సభ్యులతో చెప్పింది. ఇది తెలుసుకున్న బాలకృష్ణ తానే స్వయంగా వెళ్లారు.  ఆమెను పలకరించారు. క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె కూడా బాలయ్య కుటుంబం గురించి అడిగితే, 'మీ పిల్లలకు పెళ్లయ్యిందా?' అని అడిగారు. పిల్లల గురించి కూడా బాలయ్య ఆమెకు చెప్పారు.  

ఎన్టీఆర్ మహానటుడు అని ఆయన సినిమాలు అన్నీ చూశానని అలాంటి నటున్ని ఈ జన్మలో చూడలేనని ఎంతో గొప్పగా చెప్పింది. బాలకృష్ణ సినిమాలు కూడా బాగా చూసేదానిని అంటూ శ్రీరామ రాజ్యం సినిమా అద్భుతంగా నటించావని పొగిడింది. ఇదంతా చూస్తున్న ఆ కుటుంబ సభ్యులు కాసేపు షాక్ గురైయ్యారు ఇది కలా నిజమా అంటూ ఆశ్చర్య పోయారు. బాలకృష్ణ ను చూసి కుటుంబ సభ్యులు పట్టలేని ఆనందం పొందారు. మరి బాలయ్యా మజాకా ఏం చేసినా ఓ వెరైటీ ఉండాలి కదా..!


మరింత సమాచారం తెలుసుకోండి: