రొమాంటిక్ హీరోయిన్ గా పేరుగాంచిన శ్రియా శరన్  మూడు పదుల వయస్సు దాటిపోయినా గ్లామర్ ఎక్స్ పోజ్ చేయడంలో ఇప్పటికీ యంగ్ హీరోయిన్స్ కు పోటీని ఇస్తూ తన హవాను కొనసాగించుకోవడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం సినియా రంగంలో అవకాశాలు తగ్గిపోయిన నేపధ్యంలో ఈవారం బాలీవుడ్ లో విడుదల అవుతున్న అజేయ్ దేవగన్ తో ఆమె నటించిన ‘దృశ్యం’ సినిమా రిజల్ట్ కోసం ఆసక్తికరంగంగా ఎదురు చూస్తోంది.

ఈ సినిమా ప్రామోషన్ కోసం ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటూ నాగార్జునకు తనకు మధ్య ఉన్న సాన్నిహత్యం పై అనేక ఆసక్తికర విషయాలను బయట పెట్టింది. తాను ఇప్పటి వరకు నటించిన అనేక సినిమాలలోని హీరోల ఆకర్షణకు ప్రభావితం కాబడినా తనకూ  నాగార్జునకు మధ్య ఉన్న స్నేహం చాల స్పెషల్ అంటూ కామెంట్ చేసింది. 

నాగార్జున అంత స్వీట్ హార్ట్ తాను ఏ హీరో వ్యక్తిత్వంలోను చూడలేదని తనకు తన కెరియర్ తొలినాళ్ళలోనే అనేక అవకాశాలు ఇవ్వడమే కాకుండా తనను పిలిచి మళ్ళీ ‘మనం’ సినిమాలో అవకాశం ఇచ్చి తన కెరియర్ కు మరో టర్నింగ్ ఇచ్చిన నాగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ నాగార్జునను ఆకాశంలోకి ఎత్తేసింది. అంతేకాదు నాగార్జున ఇల్లు తన సొంత ఇల్లులా తాను భావిస్తానని నాగార్జున ఇద్దరు కొడుకులు కూడ తనతో చాల సన్నిహితంగా ఉంటారు అంటూ అక్కినేని కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యాన్ని బయట పెట్టింది. 

ఇక నాగార్జున భార్య అమల అయితే తనను ఎంతో అభిమానిస్తుందని అంతేకాకుండా తనను విపాసనా యోగాకు పరిచయం చేసిన వ్యక్తి కూడ అమలే అని చెపుతూ తాను ఈ వయస్సులో ఇంత గ్లామర్ గా కనిపిస్తున్నాను అంటే ఆ యోగా ఎక్స్ సైజ్ లు వలెనే అని చెపుతోంది శ్రియ. ఇకపోతే తన పెళ్ళి గురించి చెపుతూ తనను మానసికంగా ఆధ్యాత్మికంగా ఎమోషనల్ గా బాగా చూసుకునే వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాను అని చెపుతోంది శ్రియా శరన్..



మరింత సమాచారం తెలుసుకోండి: