తెలుగు చిత్ర పరిశ్రమలోకి ‘అలా మొదలైంది’ సినిమాతో నాని సరసన క్యూట్ గా బబ్లీగా సందడి చేసిన మళియాళ కుట్టి నిత్యామీనన్. తర్వాత తెలుగు,తమిళ,మళియాళీ ఇండస్ట్రీలో ఈ అమ్మడికి మంచి ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా ఉన్న నిత్యామీనన్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉంటుంది. ఆ మద్య సహజీవనం (డేటింగ్) గురించి మాట్లాడుతూ ఇద్దరు ఆడామగ కలిసి ఉంటే సమాజంలో తప్పు పడతారు కానీ పెళ్లిల్లు చేసుకొని ఎంత మంది సంతోషంగా ఉన్నారు. పెళ్లికి ముందు సహజీవనం చేస్తే ఒకరి అభిప్రాయం ఒకరికి తెలుస్తుంది నచ్చక పోతే విడిపోతారు.. నచ్చితే జీవితాంతం కలిసి ఉంటారు అంటూ సహజీవనానికి ఓటు వేసింది.

తాజాగా సినిమా ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కింది. విషయానికి వస్తే.. చిత్రపరిశ్రమలో హీరోయిన్లను కేవలం గ్లామర్ కోసమే వాడుకుంటున్నారంటూ ప్రకటించింది.టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో హీరోయిన్‌ కి ఏమాత్రం ఛాయిస్ ఉండడం లేదు. కథ, పాత్ర తో బాటుగా అమ్మడికి స్క్రీన్‌ ప్లే కూడా నచ్చాలట. అలా అయితేనే సినిమా ఒప్పుకుంటానని చెప్పుకొచ్చింది. కేవలం గ్లామర్ ఒలకబోయడానికే ఆమెను పరిమితం చేస్తున్నారు. అన్నింటా హీరోల ఆధిక్యమే కనిపిస్తోంది.” అంటూ ఆరోపించింది. ఆ మద్య రాధికా ఆప్టె కూడా ఇలాంటి సంచలన వ్యాఖ్యలుచేసి వివాదం రేపింది.


నిత్యామీనన్


టాలీవుడ్ లో హీరోలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని హీరోయిన్ రెండు పాటల కోసం గ్లామర్ పాత్ర కోసమే తీసుకుంటారని హీరోలకు ఉన్న ప్రియార్టీ హీరోయిన్లకు అస్సలు లేదని వ్యాఖ్యలు చేసింది. అందరూ హీరోయిన్ల మాదిరిగా తాను కూడా వార్తల్లో వ్యక్తిగా నిలవాలని ఎప్పుడూ కోరుకోలేదంటూనే ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేసి మీడియా దృష్టి తన పై పడేలా చేసుకోవడంలో నిత్యా స్టైల్  ఇప్పుడు ఈ మళియాళి కుట్టీ చేసిన వ్యాఖ్యలకు చిత్ర పరిశ్రమ ఏలా స్పందిస్తూందో వేచి చూడాల్సిందే.. 


మరింత సమాచారం తెలుసుకోండి: