మెగా బ్రదర్ నాగబాబుకు వరుణ్ తేజ్ నటిస్తున్న ‘కంచె’ షాకింగ్ గా మారింది అన్న వార్తలు వస్తున్నాయి. క్రియేటివ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ‘కంచె' షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ఈ సినిమాకు  సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈనెల మొదట్లోనే విడుదల చేసారు.  

అయితే ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా రషస్ చూసిన నాగబాబు షాక్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం  తాను ఊహించిన దానికంటే ఈ సినిమా  చాలా బాగా వచ్చిందని నాగబాబు తన సన్నిహితులతో చేపుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు  స్టన్నింగ్ విజువల్స్ తోపాటు వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్ తో ‘కంచె' సూపర్ హిట్ కావడం ఖాయం అంటూ నాగబాబు తనతో సాన్నిహిత్యం ఉన్నవారందరికీ ఫోన్ చేసి మరీ చేపుతున్నాడని టాక్.

స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కథాంశంతో తీయపడ్డ ఈసినిమాలో వరుణ్ తేజ్ సైనికుడిగా కనిపించబోతున్నాడు.  మిస్ ఇండియా కాంటెస్ట్ లోఫైనల్స్ కు చేరుకున్న ప్రజ్ఞ జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాను అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు విడుదల చేయాలని మొదట్లో భావించిన ఈ సినిమా దర్శక నిర్మాతలు ఆనెలలో దసరాకు విడుదల కాబోతున్న రామ్ చరణ్ శ్రీనువైట్లల సినిమాను దృష్టిలో పెట్టుకుని ‘కంచె’ సినిమాను గాంధీ జయంతి నాడు కాకుండా దీపావళి పండుగను టార్గెట్ చేస్తూ విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తుబ్న్నాయి. 

అయితే స్వాతంత్రం పూర్వం కాలంనాటి సంఘటనలతో జమిందారి వ్యవస్థ నేపధ్యంలో తీసిన ఈ సినిమా నేటి యూత్ ప్రేక్షకులకు నచ్చుతుందా? అన్నభయం మాత్రం నాగబాబును లోలోపల వెంటాడుతోంది అని టాక్. మరి ‘కంచె’ వరుణ్ తేజ్ కు ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: