మెగాస్టార్ తనయుడు రాంచరణ్, శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా తీస్తున్నాడు. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న ఈ సినిమా లో చిరంజీవి, నాగార్జునాలు అతిథి పాత్రలు చేస్తున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిదే. ఆ మద్య మగధీర సినిమాలో కొద్ది నిమిషాలు చిరంజీవి కనిపించి పోతాడు. ఇప్పుడు చిరుతోపాటు నాగ్ కూడా వస్తున్నాడంటే ఇక సినిమాలో అంచనాలు వేరే చెప్పాలా..ఇప్పుడు మరో సంచలన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 

 ఇప్పటి  హీరోలు పాత తరంలా కాదు..   ఒకరికొకరు ఆప్యాయంగా పలుకరించుకుంటారనీ, ఒకరి క్షేమం మరొకరు కోరుకుంటారని.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు  మోహన్‌ బాబు వ్యాఖ్యానించారు.ఒకరి సినిమాకి మరొకరు క్లాప్‌ కొడుతుంటారు. వీలుంటే ఒకరి సినిమాకి మరొకరు వాయిస్‌ ఓవర్‌ అందిస్తుంటారు. ఇప్పుడు ఇదే జరుగుతుంది ప్రస్తుతం రామ్‌ చరణ్‌ శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్


ఈ చిత్రానికి ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే.. ఇంతకంటే మంచి వాతావరణం ఏముంటుందని ఫిలింనగర్‌లో అనుకుంటున్నారు. దసరాకు బాక్సాఫీస్ బరిలోకి ఈ సినిమాని ఉంచాలని ఉవ్విళ్లూరుతున్న చెర్రీ సినిమాకి టైటిల్ విషయంలో మాత్రం అభిమానుల్ని కొంచెం కన్ఫ్యూజన్ చేస్తున్నాడనే చెప్పాలి.రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు బయట క్లోజ్ ఫ్రెండ్స్, అలాగే ఎన్టీఆర్, శ్రీనువైట్లకు ఉన్న రిలేషన్ కారణంగా ఎన్టీఆర్ వాయిస్ ఇవ్వడానికి అంగీకారించాడని సమాచారం. శ్రీనువైట్ల దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైన్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి మొదట్లో మైనేమ్ ఇజ్ రాజు, బ్రూస్లీ, విజేత, తాజాగా ఫైటర్ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: