ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్స్ కంటే, క్లీన్ ఫిల్మ్ మేకర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అటువంటి వారిలో శేఖర్ కమ్ముల ఒకరు. గత కొంత కాలంగా శేఖర్ కమ్ముల రాసుకున్న కథలన్నీ, ఆఫీస్ లో పేరుకుపోతున్నాయి కాని, వాటికి మాత్రం ప్రొడ్యూసర్స్ దొరకటం లేదు.

వచ్చిన అతి కొద్ది మంది ప్రొడ్యూసర్స్..కథలో కోరే కమర్షియల్ ఎలిమెంట్స్ లేవని, ఒకవేళ వాటిని సరిచేస్తే..చేయటానికి సిద్ధం అంటూ చెప్పి వెళ్ళి పోతున్నారు. ఒక్కసారి కథ ఫైనల్ అయిన తరవాత, దానిలో మార్పులు అంటే శేకర్ అంతగా నచ్చే వ్యవహారం కాదు. దాంతో ఆ కథ కాస్త పక్కన పడిపోతుంది. ఇదిలా ఉంటే తాజాగా రానా తీసుకున్న నిర్ణయం శేఖర్ కి కొంత్ర బ్రీతింగ్ ఛాన్స్ వచ్చింది.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా హీరోగా పరిచయమైన‘లీడర్’ చిత్రం సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందిస్తున్నట్లు రానా ట్విటర్ ద్వారా తెలిపాడు. ‘లీడర్’ చిత్రంలో నటించిన రానాకు తొలి చిత్రంతోనే ప్రేక్షకుల నుండి మంచి మార్కులు వచ్చాయి. తాజాగా ఈ చిత్రం సీక్వెల్‌పై రానా ట్విట్ చేశాడు. 

‘‘థాంక్యూ చీఫ్...‘లీడర్ 2’ వర్క్ స్టార్ట్ అయింది, త్వరలోనే కథని సిద్ధం చేసి తెరకెక్కిస్తాం’’ అని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఇటీవల విడుదలైన ‘బాహుబలి’లో భళ్లాలదేవగా అలరించిన రానా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో శేఖర్ కమ్ముల సైతం లీడర్ సీక్వెల్ ని, ప్రస్తుతం రాజకీయ పరిస్థితులకి అనుగుణంగా తీర్చిదిద్దుతున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: