తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి  ఓ వటవృక్షం అయితే ఆ చెట్టు కొమ్మలం మేం అంటూ ఆ మద్య వరంగల్ లో రుద్రమదేవి ఆడియో ఫంక్షన్లో అల్లు అర్జున్ తన మేనమామ చిరంజీవి గురించి చెప్పాడు. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పైకి వచ్చి ఇప్పుడు తన వారసత్వంగా మెగా యువహీరోలను వెండితెరకు పరిచయం చేస్తున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో మెగా హీరోలుగా పవన్ కళ్యాన్, రాంచరణ్,అల్లు అర్జున్,సాయిధర్ తేజ్,వరుణ తేజ్,అల్లు శిరీష్ లాంటి యువ హీరోలు వచ్చారు.


తిక్క సినిమా ముహూర్తంలో సాయి ధరమ్,సునీల్


చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రేయ్ సినిమా తో వెండితెరకు పరిచయం అయ్యాడు కానీ కొన్ని అవాంతరాల వల్ల ఆ సినిమా కంటే ముందు ‘పిల్లా నువ్వలేని జీవితం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. ఇక మెగా వారి ఇంటి నుంచి వచ్చారంటే డ్యాన్స్, ఫైట్, పర్ఫామెన్స్ ఉండాల్సిందే.. ఈ మూడింటిలోనూ మంచి మార్కులు కొట్టేశాడు సాయి ధరమ్. తాజాగా సాయి ధరమ్ తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ బేనర్లో జులై 31న ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్ లో సినిమా ప్రారంభమైంది.

ముహూర్తం  షూటింగ్ లో పాల్గొన్న నాగబాబు


సునీల్ రెడ్డి దర్శకత్వంలో సి.రోహిణ్ కుమార్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘తిక్క' అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన లారిస్సా బోనేసి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ముహూర్తపు సన్నివేశాని అల్లు అరవింత్ క్లాప్ కొట్టగా.. తెలంగాణ మినిస్టర్ మహేందర్ రెడ్డి కెమెరా స్విచాన్ చేసారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హీరో సునీల్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్ రమణ, అలీ, నవీన్ విజయ్ కృష్ణ తదితరులు హాజరయ్యారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: