ఆర్పీ పట్నాయక్‌.. తెలుగు సినిమా ప్రియుల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఒకప్పట్లో ట్రెండ్‌ సెటింగ్‌ సంగీతాన్ని అందించిన వ్యక్తి. ఆ తర్వాత బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఇండస్ట్రీలో గుర్తింపుతెచ్చుకున్నారు. హీరోగా, నటుడిగా సినిమాలు చేశారు. సినిమా నిర్మాతగా, దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా.. ఇలా తనకు పరిణతి లేని క్రాఫ్ట్‌ లేదన్నట్లుగా బహుముఖ ప్రజ్ఞ చూపించుకున్న వ్యక్తి. కానీ ఆర్పీకి ప్రస్తుతం సినిమాలు పెద్దగా లేవు. సంగీతం కంటె దర్శకత్వానికే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలనుకోవడం, దర్శకత్వం ఆఫర్లు ఎవరూ ఇవ్వకపోవడం జరుగుతోంది. అలా నిరీక్షిస్తున్న ఆర్పీకి ఓ బంపర్‌ ఆఫర్‌ తగిలింది. సినిమా ఛాన్స్‌ కాదు. కోర్టు కేసు. 


ఆర్పీ పట్నాయక్‌ గతంలో తులసీదళం అనే చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో నిర్మించాడు. ఆయనే సంగీతం కూడా సమకూర్చాడు. ఆ చిత్రం విడుదలకు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆగిపోయింది. మొత్తానికి విడుదల కాలేదు. అయితే.. ఈలోగా ఆ చిత్రంలోని పాటలను 'అత్తో అత్తమ్మ కూతురో' అనే టైటిల్‌తో ప్రస్తుతం ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌ టీవీ ఛానెల్‌లో వస్తున్న సీరియల్‌లో వాడేసుకున్నారట. తన సినిమా పాటను తన అనుమతి లేకుండా.. సీరియల్‌లో వాడేసుకోవడంపై ఆర్పీ ఆగ్రహించి.. కోర్టుకెక్కబోతున్నాడు. 


సీరియల్‌ నిర్మాతనుంచి 50 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కోరుతూ కోర్టులో దావా వేయబోతున్నట్లు ఆర్పీ ప్రకటించేశాడు. టీవీ సీరియళ్లలో సినిమా పాటలు వాడుకోవడం కొత్త కాదని, కాకపోతే తన సినిమా ఇంకా విడుదల కానేలేదని, విడుదలకాని చిత్రంలోని కూడా వాడేస్తే... తన సినిమ మార్కెట్‌ పోతుంది గను.. నష్టపరిహారం కోర్టు ద్వారా అడగనున్నట్లు చెబుతున్నాడు. 


అయినా.. ఎప్పుడో పూర్తయిన తులసిదళం ఎప్పటికి విడుదల అవుతుందో తెలియదు. విడుదల అయినా.. ఎంత లాభాలు వస్తాయో తెలియదు. ఇలా ఎవరైనా పాటలు వాడేసుకుంటే.. కేసులు వేసి పరిహారం సంపాదించుకోవడమే ఎక్కువ లాభసాటిగా ఉన్నదని ఆర్పీ ప ట్నాయక్‌ ఫిక్సయి ఉంటారని పలువురు నవ్వుకుంటున్నారు. ుడం ఉండదని పలువురు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: