తెలుగు ఇండస్ట్రీలో తేజ దర్శకత్వంలో ‘చిత్రం’ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయిన ఆర్పీ పట్నాయక్ తర్వాత మనసంతా నువ్వే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరీ దగ్గర అయ్యాడు. ఈయన  మెలోడీ, ఫోక్ సాంగ్స్ చాలా ఆదరణ పొందాయి. ఈ మద్య కాలంలో మ్యూజిక్ డైరెక్టర్ గా ఆఫర్లు తగ్గాయి. కాకపోతే ఒకటి రెండు సినిమాలో నటుడిగా కూడా ప్రూఫ్ చేసుకున్నాడు. త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా, న‌టుడిగాను త‌న ముద్ర‌ను చాటారు. ప్ర‌స్తుతం ఆయ‌న తుల‌సీద‌ళం అనే సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఆ సినిమా సెట్స్ లో ఉంద‌ని స‌మాచారం. ఇక్కడే ఆర్పీ పట్నాయక్ చిర్రెత్తుకొచ్చింది.

ఈ సినిమా విడుద‌ల కాకుండానే  త‌మ అనుమ‌తి తీసుకోకుండా బుల్లి తెర పై ప్ర‌త్య‌క్ష‌మ‌వుతోన్న అత్తో అత్త‌మ్మ కూతురో  సీనియ‌ల్ నిర్మాత‌లు ఆ సినిమాలో ట్రాక్స్ ను వాడుకున్నార‌ట‌.   మీడియా సమావేంలో   ఆయన మాట్లాడుతూ.. టీవీ సీరియళ్ల నిర్మాతలు, దర్శకులపై నిప్పులు చెరిగారు. ‘‘మేం సినిమాల కోసం తయారుచేసిన ట్రాక్స్‌ అన్నింటినీ, సినిమా పాటల్నీ వాళ్ల సొంత పాటల్లా ఇష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా వాడేస్తున్నారు టీవీ సీరియళ్ల వాళ్లు. ఇక రిలీజవని సినిమాల పాటల్ని కూడా వాళ్లు వాడేస్తున్నారు. అంటే వాళ్లు వాడిన పాటను మేం సినిమాల కోసం వాడుకున్నట్టవదా? వాళ్లు ఏమనుకుంటున్నారు? ‘అత్తో అత్తమ్మకూతురో’ అనే సీరియల్‌లో గురువారం రాత్రి నా ‘తులసీదళం’ సినిమాలోని పాట మొత్తం వచ్చేసింది. ఎంతో కష్టపడి పాటలు కంపోజ్ చేస్తే అప్పలంగా వాడేసుకుంటున్నారు.

అత్తో అత్తమ్మ కూతురో సీరియల్


ఈ విషయంలో ఏవరినీ క్షమించేది లేదు సొంత అన్నదమ్ములైనా ఈ విషయంలో మినహాయించేది లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సీరియ‌ల్ నిర్మాత‌ల‌పై 50 ల‌క్ష‌లు న‌ష్ట‌ప‌రిహారం కోరుతు దావా వేయ‌నున్న‌ట్లు ఆర్పీ వెల్ల‌డించారు. ఈ సీరియ‌ల్ ప్రారంభ‌మై రెండు నెల‌లు కూడా గ‌డ‌వక ముందే వివిదాల్లో చుక్కుకుంద‌ని తెలుస్తోంది. ఇందులో అల‌నాటి న‌టి నిరోష జాకీ, మ‌హ‌ర్షి త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ సీరియ‌ల్ జెమినీ ఛానెల‌లో ప్ర‌సారం అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: