ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా యువతరం అంతా మంచి జోష్ లో జరుపుకుంటున్న ఫ్రెండ్ షిప్ డే పై కామెంట్స్ చేసాడు మహేష్ బాబు. ఈ వ్యాఖ్యలు ఆసక్తి దాయకంగా ఉన్నాయి. తన జీవితంలోని బెస్ట్ ఫ్రెండ్స్ అంతా చెన్నైలోనే ఉన్నారని అయితే తాను హైదరాబాద్ వచ్చేయడంతో తన కెరియర్ బిజీ వల్ల వారందరికీ దూరం అయిపోయాను అన్న బాథ తనకు ఉన్నా ఇన్ని కోట్ల మంది అభిమానులను పొందిన ఆనందం ముందు తన ఫ్రెండ్స్ దూరం అయ్యారు అన్న బాథ మర్చిపోతున్నాను అంటూ కామెంట్స్ చేసాడు మహేష్. 

ఈ వారం విడుదల కాబోతున్న తన ‘శ్రీమంతుడు’ సినిమా ప్రమోషన్ గురించి ఒక ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు మహేష్. ఇదే సందర్భంలో ఈమధ్య విడుదలై సునామి సృస్టించిన ‘బాహుబలి’ గురించి మాట్లాడుతూ ఈసినిమా వల్ల స్టార్స్ షేక్ అవ్వరని ఇటువంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత టాలీవుడ్ మార్కెట్ పెరగడంతో వచ్చే టాప్ హీరోల సినిమాలు మరో 10-15 కోట్లు ఎక్కువ వసూలు చేసినా ఆశ్చర్యం లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు మహేష్. 

ఇదే సందర్బంలో తన తండ్రి నటించిన ఒకనాటి ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా గురించి మాట్లాడుతూ ఈసినిమా తనకు ఒక బైబిల్ లాంటిదని అటువంటి సినిమాలను చూసి ఆనంద పడాలి తప్ప మళ్ళీ ఆ స్థాయిలో సినిమా తీయాలని ప్రయత్నిస్తే ఎవరికైనా షాక్ తగలడం ఖాయం అని అన్నాడు మహేష్. అయితే తన తండ్రిలా ఒక మంచి జేమ్స్ బాండ్ పాత్రలో నటించాలని కోరిక ఉన్నా అటువంటి సినిమా తనతో తీయడానికి ఇంకా ఎవ్వరూ ముందుకు రావడంలేదు అంటూ కామెంట్స్ చేసాడు మహేష్. 

పరాజయాలు వచ్చినప్పుడు కొద్దిరోజులు నిరాశ కలిగినా ఆ తరువాత వెంటనే ఆ నిరాశ నుండి బయటకు వస్తానని అయితే తాను బయట పడినంత త్వరగా తన అభిమానులు ఫెయిల్యూర్ షాకుల నుండి వెంటనే బయటకు రారని అందువల్లనే తన అభిమానులకు బహిరంగంగా క్షమార్పణలు చెప్పాను అంటూ ప్రయోగాలు చేయడంలో తానెప్పుడు ముందు వరసలో ఉంటాను అంటూ ‘శ్రీమంతుడు’ విజయం కోసం ఎదురు చూస్తున్నాడు మహేష్ బాబు..


మరింత సమాచారం తెలుసుకోండి: