తెలుగు ఇండస్ట్రీలో ఎస్ ఎస్ రాజమౌళి అంటే వెరైటీకి పెట్టింది పేరు అని  ప్రయోగాలకు నాంది పలికే దర్శక ధీరుడు అని తెలుసు. ఈయన ఏం చేసినా సినిమాలో ఓ స్పెషల్ అప్పిరియన్స్ ఉండాలని కోరుకునే వ్యక్తి ఇప్పుడు ప్రపంచ స్థాయి సినీ ఇండస్ట్రీలన్ని తన వైపు చూసేలా చేసుకున్నాడు రాజమౌళి. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు రాని అద్భుతమైన చిత్రంగా ‘బాహుబలి’ ప్రపంచ వ్యాప్తంగా సంచలన సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు రాజమౌళి పెద్ద హీరోలకు ఝలక్ ఇవ్వబోతున్నాడా అంటే అవుననే చెప్పాలి. దీనికి కారణం బాహుబలి 2 సినిమా త్వరలో సెట్స్ పైకి రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా 40 శాతం పూర్తి చేసుకున్నట్లు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు... అయితే మితగ షూటింగ్ పూర్తి చేసి 2016 లో విడుదలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు జక్కన్న చెబుతున్నాడు. అయితే ఈ సినిమా అయిపోయిన తర్వాత ఆయన తర్వాత సినిమా ఎవరితోనా అని అందరూ హీరోలు ఊవ్విళ్లూరుతున్నారు కానీ అవన్నీ తుస్ ... అనిపిస్తున్నాడట రాజమౌళి.  ఎందుకంటే తన దృష్టి మొత్తం మహాభారతం సినిమాపై ఉందని రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ తెలియజేశాడు.

బాహుబలి షూటింగ్ లో రాజమౌళి


జక్కన్న తో ఇప్పటికే సినిమాలు తీయాలనే ఆలోచనలో మహేష్, పవన్,అఖిల్ ఈ మద్య కొత్త రూమర్ ఒకటి పుట్టుకొచ్చింది చిరంజీవి 150 వ సినిమా కూడా జక్కన్నే తీస్తున్నాడని వీటన్నిటికి పులిస్టాప్ పెట్టబోతున్నాడా..? అంటే అవునే అనుకోవాలి ఆయన తండ్రి మాటలు చూస్తుంటే.. ఎందుకంటే మహాభాతం రాజమౌళి బిగ్గెస్ట్ డ్రిమ్ అట. ఈ విషయాని ఇంతకు ముందే జక్కన్న తన లైఫ్ టైమ్ గోల్ అదేనని ఇప్పటికే ప్రకటించాడు. ఇప్పుడు అదే పనిలో ఉన్నట్టు, బాహుబలి-2 సినిమా కంప్లీట్ అయిన వెంటనే మహాభారతం సినిమాను పట్టాలపైకి తీసుకొచ్చే ఆలోచనలో జక్కన్న ఉన్నట్టు ఫిలింనగర్ టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: