తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో  రూపొందించిన చిత్రం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల మార్క్ దాటిన తొలి దక్షిణాది చిత్రంగా బాహుబలి రికార్డు నెలకొల్పింది. 500 కోట్ల మార్క్ దాటిన తొలి దక్షిణాది చిత్రంగా బాహుబలి రికార్డు నెలకొల్పింది. ఇంతకుముందు అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది చిత్రాలకు అందనంత ఎత్తులో నిలిచింది.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఎంతిరన్ చిత్రం అత్యధికంగా 283 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ రికార్డును 9 రోజుల్లోపే బాహుబలి బ్రేక్ చేయడం విశేషం.బాహుబలి' చిత్రాన్ని విజయవంతం చేసిన ఫ్యాన్స్ కు హీరో ప్రభాస్‌ కృతజ్ఞతలు తెలిపారు.   అభిమానులు ఈ చిత్రం కోసం రెండున్నర సంవత్సరాలు వేచి చూశారు.  ప్రభాస్ ఈ విజయాన్ని ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తున్నాడట. నా ఫ్యాన్ సినిమా కోసం మూడు సంవత్సరాలు వెయిట్ చేశారని అంతకు మించిన విజయాన్ని అందించారు అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

బాహుబలి పోస్టర్


ఈ సందర్భంగా ఓ ప్రత్యేక వీడియో ప్రభాస్ పోస్ట్ చేశారు. ప్రభాస్ తన ఫ్యాన్స్ ను ముద్దుగా హాయ్ డాల్లింగ్ అంటూ సంబోదిస్తూ.. మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు అంటూ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు ఈ వీడియో సోషల నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: