ప్రముఖ టాలీవుడ్ దిగ్గజ దర్శకులు రాజమౌళికి షాకింగ్ ఇవ్వనున్నారు. టాలీవుడ్ లోని లీక్స్ ద్వారా వినిపిస్తున్న సమాచారం మేరకు, ఫిల్మ్ నగర్ లో అంతా హాట్ న్యూస్ గా వినిపిస్తుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, తెలుగు సినిమా బాక్సాఫీస్ స్థాయిని  ఒక్ససారిగా పరుగులు పెట్టింటచిన సినిమా ‘బాహుబలి’. టాలీవుడ్ సినిమా ఎప్పుడు బాలీవుడ్ స్థాయికి చేరుతుంది అని ఎదరుచూస్తున్న మాస్టర్ డైరెక్టర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలానే ఉన్నారు. 

దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా, తెలుగు సినిమా స్టామినాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళడంతో పాటు ఎన్ని భాషల్లో విడుదలైందో అన్ని భాషల్లోనూ కనివినీ ఎరుగని రీతిలో కలెక్షన్లను కొల్లగొడుతూ బాక్సాఫీస్ వద్ద రారాజుగా నిలబడింది. ప్రస్తుతం ఈ సినిమా ఓ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఓ ప్రాంతీయ సినిమా అయిన ‘బాహుబలి’ 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించి ఊహకు కూడా అందకుండా నిలిచింది.

ఇక హిందీలో ఏకంగా 100 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. మొత్తంగా బాహుబలి సినిమా అన్ని భాషల్లో కలుపుకొని, నిన్నటితో 500కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ చేరుకుంది. ఇంతటి సక్సెస్ ని సాధించిన బాహుబలి మూవీకి, అలాగే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని సౌత్ లోనే నెంబర్ వన్, అలాగే ఇండియాలో నే తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని మెరుపువేగంతో చూపించినందుకు కారకుడైన రాజమౌళికి, దర్శకరత్న దాసరి..అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, కళాతపస్వీ కె.విశ్వనాధ్ మరో ప్రముఖ దర్శకుల మధ్య బాహుబలి విజయేత్సవ కార్యక్రమం జరగనుంది.

ఇందులో రాజమౌళిని దాసరి, రాఘవేంద్రరావులు పొగడ్తలతో ముంచెత్తడం ప్రధానంగా ఉంటుందని అందరూ ఊహిస్తున్నారు. ఇక ఈ ఫంక్షన్ లో కొసమెరుపుగా స్టార్ డైరెక్టర్ వర్మ సైతం తన మాటలతో రాజమౌళిని విజయాన్ని కీర్తిస్తూ, ఇతర డైరెక్టర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసే అవకాశం సైతం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: