ఈనెల 7వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా మహేష్ ‘శ్రీమంతుడు’ విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అమెరికాలోనే కాకుండా మన ఇరు రాష్ట్రాలలోను అత్యధిక ధియేటర్లలో ఈసినిమాను విడుదల చేసి పవన్ ‘అత్తారింటికి దారేది’ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డును బ్రేక్ చేయడానికి మహేష్ అన్ని వ్యూహాత్మక ఎత్తుగడలు పూర్తి చేసాడు. ఇక పెండింగ్ లో ఉంది ప్రేక్షకుల తీర్పు మాత్రమే.

ఇటువంటి పరిస్థుతులలో మహేష్ కు హాలీవుడ్ టాప్ హీరో టామ్ క్రూజ్ టెన్షన్ పట్టుకుంది అన్న వార్తలు వస్తున్నాయి. ఇతడు నటించి భారీ అంచనాలు ఉన్న ‘మిషన్ ఇంపాజిబుల్’ రోగ్ నేషన్ కూడ ‘శ్రీమంతుడు’ కు పోటీగా మన తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలలో విడుదల కాబోతోంది. ఈ మధ్య కాలంలో హాలీవుడ్ సినిమాలు మన తెలుగు సినిమాల కలెక్షన్స్ పై బాగా ప్రభావం చూపెడుతున్న సంగతి తెలిసిందే. 

ఆ మధ్య విడుదల అయిన ‘ఫాస్ట్ అండ్ ది ఫ్యురియస్’, ఆ తరువాత వచ్చిన ‘జురాసిక్ వరల్డ్’ సినిమాలు తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్స్ సునామి సృస్టించాయి. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ‘మిషన్ ఇంపాజిబుల్’ విడుదల కావడం ‘శ్రీమంతుడు’ కన్నేసిన రికార్డులను అందుకోవడంలో ఏమైనా అడ్డు తగులుతుందా అన్న అనుమానం మహేష్ కు ఏర్పడింది అని టాక్. అయితే ఇప్పటికే ‘శ్రీమంతుడు’ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడి ధియేటర్లలో ఎడ్వాన్స్ బుకింగ్ ముందుగా అయిపోతున్న నేపధ్యంలో ‘శ్రీమంతుడు’ కు టామ్ క్రూజ్ వల్ల ప్రమాదం లేదు అన్న విశ్లేషణలు కూడ వినిపిస్తున్నాయి. 

ఈ వార్తలు ఇలా ఉండగా చెన్నైలోని ‘పార్క్ హయట్’  హోటల్ లో జరిగిన ‘శ్రీమంతుడు’ తమిళ వర్షన్ ‘సెల్వoదన్’ ఆడియో వేడుక అత్యంత ఘనంగా జరగడమే కాకుండా ఈ కార్యక్రమానికి కోలీవుడ్ ప్రముఖ దర్శకులు చాలామంది వచ్చి మహేష్ ను అభినందించడం కోలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ మీడియా వ్రాస్తున్న వార్తల ప్రకారం చెన్నైలో ‘సెల్వందన్’ భారీ ఓపెనింగ్స్ ను తెచ్చుకొబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. ఎలా చూసినా ‘బాహుబలి’ మ్యానియా తరువాత వస్తున్న ‘శ్రీమంతుడు’ ఓపెనింగ్ రికార్డ్స్ విషయంలో సంచలనాలు సృస్టించడం ఖాయం అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: