గత కొంత కాలంగా స్ట్రగుల్స్ లో ఉన్న తాప్సీకి, ప్రస్తుతం వరుస ఆఫర్స్ వరిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ఇటు కోలీవుడ్లో, అటు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలకి బాగానే డేట్స్ కవర్ చేసుకుంటున్న క్యూట్ బ్యూటీ తాప్సీ ఇటీవలే వ్యాపారవేత్తగానూ మారి రెండు పడవలపై ప్రయాణానికి సిద్ధమైంది.
హీరోయిన్ గా మాంచి ఊపు మీద ఉన్నప్పుడే, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇటీవలే గంగగా భయపెట్టిన అమ్మడు, ఇప్పుడు దేశభక్తురాలిగానూ మెప్పించేందుకు సిద్ధమవుతోంది. అంతే కాదు మరో వైపు పల్లె పడుచు గానూ కనిపించనుంది. అయితే ఈ ప్రయత్నాలు అన్నీ తెలుగులో మాత్రం కాదు.
తమిళంలో.. అవును, తాప్సీకి తెలుగు కంటే తమిళంలో ఎక్కువ ఆఫర్స్ వరిస్తున్నాయి. గంగ సక్సెస్ తరువాత, తాప్సీ ఇటీవలే తమిళంలో రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఒకటి శింబు హీరోగా తెరకెక్కుతున్న 'కాన్' కాగా మరొకటి జర్నీ ఫేమ్ జై హీరోగా నటిస్తున్న సినిమా. కాన్ లో డిఫెన్స్ వింగ్ కు చెందిన సీక్రెట్ ఏజెంట్ గా కనిపంచనున్న తాప్సీ పలు యాక్షన్ సీన్స్ లో నటించటానికి రెడీ అవుతోంది.
మరోవైపు తిరు దర్శకత్వంలో జై హీరోగా తెరకెక్కునున్న చిత్రంలో అమ్మడు పల్లెటూరి పిల్లగా మురిపించబోతోంది. ఇప్పటికే గుండెల్లో గోదావరిలో పదారణాల పల్లె పడుచుగా అలరించి ఉండటంతో ఈ పాత్ర కూడా అమ్మడికి కొట్టిన పిండేనని అనడంలో సందేహం లేదు. ఈ విధంగా తమిళ ఇండస్ట్రీ ఇంత కాలానికి తాప్సీ టాలెంట్ ని గుర్తించినందుకు తనకి చాలా హ్యాపీగా ఉందని చెప్పుకుంటుందట.