ప్రస్తుతం కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా వినపబడుతుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, గతంలో ఎఫైర్ నడిపిన శింబు, హన్సికలు తిరిగి ఒకటి కాబోతున్నారనే టాక్స్ కోలీవుడ్ లో వినిపిస్తున్నాయి. తాజాగా వాలు సినిమా సక్సెస్ కావాడంతో శింబు ప్రతి ఒక్కరి విషెష్ చెప్పుకొచ్చింది. 

అంతేకాదు మూవీ రిలీజ్ కి సహకరించిన స్టార్ హీరో విజయ్ కి, టి. రాజేందర్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని ట్వీట్ చేసిందట హన్సిక. ఇందులో కొసమెరుపు ఏమిటంటే, శింబు మళ్ళీ ఫాంలోకి రావాలని కోరుకుంటున్నాను అంటూ సన్నిహితులతో చెప్పుకొచ్చింది. గతంలో శింబు పలు హీరోయిన్స్ తో ఎఫైర్ ఉన్నప్పటికీ, హన్సిక మాత్రం అటువంటివి ఏమి పట్టించుకోకుండా..శింబుతో చాలా కాలం రిలేషన్ మెయింటెన్ చేసింది.

తరువాత వచ్చిన మనస్ఫర్ధలు కారణంగా ఇద్దరూ దూరంగా ఉండిపోయారు. కాని తాజాగా హన్సిక చెప్పిన థ్యాంక్యూ ట్వీట్స్ ఇప్పుడు టోటల్ కోలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించిన హన్సిక ఇప్పటివరకు కృతజ్ఞతలు తెలిపిన సందర్భాలు లేవట. కొన్నిసార్లు చెప్పినా అవి తన వ్యక్తిగత వ్యవహరాలు కోసం చెప్పిన విషెస్ తప్పితే ఒక సినిమా కోసం ఎప్పుడూ ఇలా స్పందించలేదట.

అయితే వాలు మూవీలో తన మాజీ లవర్ శింబు హీరో కావడమే హన్సిక రియాక్షన్ కి అసలు కారణమని అంటున్నారు. ఈ చిత్రంతో శింబు హన్సికల మధ్య మళ్లీ ప్రేమ చిగురించిదనే రూమర్స్ సైతం తెగ షికార్లు చేస్తున్నాయి. అంతే కాకుండా శింబు తిరిగి ఫాంలోకి వస్తే, ఇద్దరూ పెళ్ళి చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు కోలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: