‘గబ్బర్ సింగ్’ సూపర్ హిట్ తో టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయిన హరీష్ శంకర్ జూనియర్ తో తీసిన ‘రామయ్యా వస్తావయ్యా’ ఫ్లాప్ తో ఫ్లాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు. దీనితో హరీష్ శంకర్ తో సినిమాలు చేద్దాము అనుకున్న టాప్ హీరోలు, టాప్ నిర్మాతలు హరీష్ శంకర్ నుండి దూరంగా జరిగిపోయారు. 

ఈ పరిస్థుతుల నేపధ్యంలో రెండు ఏళ్ళు చేయడానికి చేతిలో సినిమాలు లేకపోవడంతో తెగ టెన్షన్ పడిపోయాడు హరీష్. అయితే ఏదోవిధంగా నిర్మాత దిల్ రాజ్ ను ఒప్పించి అల్లుఅర్జున్ కోసం గతంలో తయారు చేసుకున్న కధను కొన్ని మార్పులు చేసి సాయి ధరమ్ తేజ్ తో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ గా మార్చాడు. 

కానీ గత ఆదివారం జరిగిన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ ఆడియో ఫంక్షన్ లో మాత్రం హరీష్ కొత్త కథ వినిపించాడు. ‘‘ఒక్కో స్క్రిప్టు ఒక్కొక్కరిని వెతుక్కుంటూ వెళ్తుందంటారు. ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ తేజును వెతుక్కుంది. ఈ సినిమాకు తేజు వంద శాతం పర్ఫెక్ట్’’ అని చెప్పాడు హరీష్ శంకర్. అంతేకాదు ‘గబ్బర్ సింగ్’ సినిమా సిటింగ్స్ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఇంట్లో తేజును చూశానని అతడిని చూడగానే తన సుబ్రమణ్యం క్యారెక్టర్ కి అతనే పర్ఫెక్ట్ అని ఫిక్సయిపోయానని ఒక మంచి కథను అల్లాడు హరీష్. 

అయితే ఆతరువాత మాట్లాడిన సాయి ధరమ్ తేజ్ అనుకోకుండా హరీష్ శంకర్ కు తన మాటలతో షాక్ ఇచ్చాడు. ఈసినిమా వేరే హీరో చేయవలసి ఉందని అయితే అనుకోకుండా ఈ ప్రాజెక్ట్ లో తాను వచ్చి చేరాను అని అంటూ తాను ఆపాత్రని చేయగలనా అని భయ పడుతున్నప్పుడు తనను ప్రోత్సహించి తన చేత బాగా హరీష్ శంకర్ నటింప చేసాడు అని కామెంట్స్ చేసాడు సాయి ధరమ్ తేజ్. దీనితో అతడి మాటలు విన్న చాలామంది తేజూ హరీష్ శంకర్ ను పోగుడుతున్నాడా లేదా అసలు విషయాన్ని బయట పెడుతున్నాడా అని కామెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలు హరీష్ శంకర్ వరకు వెళ్ళడంతో సాయి ధరమ్ తేజ్ తన అనాలోచిత మాటలు వల్ల తనకు తల నొప్పిని తెచ్చి పెట్టాడు అని తన సన్నిహితుల వద్ద కామెంట్ చేసినట్లు టాక్..  



మరింత సమాచారం తెలుసుకోండి: