ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో తీసిన సినిమాలకు విపరీతమైన ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు సినిమా షూటింగ్ అయ్యిందంటే.. పేపర్లలో యాడ్స్ వేసేవారు.. తర్వాత టీవీ మాద్యమాల ద్వారా ప్రచారాలు చేసేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది.. ఫేస్ బుక్,ట్విట్టర్ లతో ప్రజల్లోకి కనెక్ట్ అవుతూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఇక సోషల్ నెట్ వర్క్ ద్వారా విపరీతమైన ప్రచారం పొందిన చిత్రం బాహుబలి. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి యూట్యూబ్ లో హల్ చల్ చేస్తూ.. ఇప్పుడు భారత దేశ చలన చిత్రం రంగంలోనే రికార్డు నెలకొల్పారు. ఇక ఇదే ట్రెండ్ కొనసాగిస్తున్నారు ఇప్పుడు రిలీజ్ కాబోయే చిత్ర దర్శక నిర్మాతలు.

తాజాగా అనుష్క,ఆర్య నటించిన చిత్రం ‘సైజ్ జీరో’ రోజూ ఓ కొత్త తరహాలో పోస్టర్లు విడుదల చేసి తెగ సందడి చేస్తున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘సైజ్ జీరో'. . స్టార్ హీరోయిన్ అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో అనుష్క గత సినిమాల కంటే భిన్నంగా లావుగా కనిపించబోతోంది. ఈ సినిమా కోసం అనుష్క దాదాపు ఇరవై కేజీల బరువు పెరిగింది. బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ‘సైజ్ జీరో' సినిమా ప్రారంభం నుండి ప్రేక్షకుల్లో, సినీ అభిమానుల్లో భారీ క్రేజ్ ను క్రియేట్ చేసింది.

సైజ్ జీరో పోస్టర్స్


ఈ చిత్ర కథాంశం ప్రకారం అనుష్క భారీ లుక్ తో కనపడనుంది.  డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం వెయిట్ లాస్ కి సంబంధించిన కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా భారీ లెవల్లోవిడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న, వరల్డ్ వైడ్ గా 1500 స్క్రీన్స్ లో ఈ సినిమా విడుదల చేస్తున్నారు. ఎంటర్ టైన్ మెంట్ కూడా ఈ చిత్రంలో భారీగా ఉంటుందని చిత్రయూనిట్ పెర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: