మాస్ మహారాజ రవితేజాతో సన్నిహితంగా రొమాన్స్ చేయడానికి క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ అడ్డంగా ఉన్న తన తల్లిని తప్పించిన విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టింది. ఈ విషయాన్ని నవ్వుతూ రకుల్ లీక్ చేయడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం లిప్ లాక్ సీన్స్ కు పెరిగి పోయిన క్రేజ్ రీత్యా హీరోయిన్స్ ఇప్పుడు లిప్ లాక్ సీన్స్ లో నటించడానికి అడ్డుచెప్పడం లేదు.

లేటెస్ట్ గా  కంగనా రనౌత్ ఒక బాలీవుడ్ సినిమా  కోసం 24 గంటల పాటు తోటి హీరోతో పెదాలను ముద్దాడిన సంగతి తెలిసిందే. అదీ కాకుండా ముద్దు పెట్టుకోవడం ఒక కళగా భావిస్తున్నారు నేటి తరం హీరోయిన్స్. ఈ నేపధ్యంలో  ఇలాంటి మాటలనే ‘కిక్ 2లో’ నటించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా చెపుతోంది. ఈమధ్య ఈసినిమా ప్రమోషన్ గురించి మీడియాతో మాట్లాడుతూ  ‘కిక్ 2’ లోని తన లిప్ లాక్ సీన్ గురించి కామెంట్స్ చేసింది. 

ఆ సన్నివేశం షూటింగ్ జరిగే రోజు దర్శకుడు సురేంద్ర రెడ్డి ఒక రొమాంటిక్ ను తీస్తున్నానని రకుల్ తో చేప్పాడట. అయితే ఆ రోమంటిక్ సీన్ లిప్ లాక్ సీన్ గా మారడంతో ఆ షూటింగ్ స్పాట్ లో తనతో ఉన్న తన తల్లిని  ఏదో వంకతో అలా బయటకు తీసుకెళ్లమని చెప్పి ఆ గ్యాప్‌లో రవితేజాతో లిప్ లాక్ లాగించేశానని చెపుతోంది రకుల్ ప్రీత్. అంతేకాదు ఈ సీన్ రవితేజతో చేస్తున్నప్పుడు ఎటువంటి సమస్యరాలేదని తమ రెండు పెదవులను అలవోకగా కలిపేస్తూ ముద్దిచ్చేసిన ఆ సీన్ కు కావల్సినంత ఎమోషన్ పండిచాను అని చెపుతోంది రకుల్. 

ఇదే సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో చేస్తున్నావు కదా, వారితో కూడ ఇలాగే ముద్దు సీన్స్ లో నటిస్తావా అని మీడియా అడిగితే కథ  డిమాండ్ చేస్తే తప్పదు కదా అంటూ జోక్ చేసింది రకుల్ ప్రీత్. అయితే రకుల్ ఇంత కష్టపడి ‘కిక్ 2’ లో ఈ సీన్ చేసినా నిర్మాత కళ్యాణ్ రామ్ కు ఏమాత్రం కలిసి రాకపోవడమే కాకుండా ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ కు 10 కోట్లకు పైగా నష్టాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: