రిలీజ్ అయిన నాటినుండి ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తున్న సినిమా శ్రీమంతుడు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు రెండు వరుస ఫ్లాపుల తర్వాత వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుండే హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇకపోతే ఇప్పటివరకు దాదాపు 80 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి ఇప్పటివరకు ఉన్న నాన్ బాహుబలి రికార్డులన్నీ చెరిపేసింది శ్రీమంతుడు. అయితే శ్రీమంతుడు సక్సెస్ మీట్లో కొన్ని అద్భుతమైన సీన్లు కట్ చేశారని. ఆ సీన్లు పెడితే ఇంకా రిపీటెడ్ ఆడియెన్స్ వచ్చే ఛాన్స్ ఉందని అప్పట్లో అన్నారు.

 

దర్శకుడు కొరటాల శివ కూడా దాని గురించి ప్రస్థావించి త్వరలో యాడ్ చేస్తామన్నాడు. అయితే తెలుస్తున్న కథనాల ప్రకారం కట్ చేసిన ఆ సీన్లు యాడ్ అయ్యాయని ఎక్స్ క్లూజివ్ న్యూస్. ఇప్పటికే శ్రీమంతుడు సినిమాను కొన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ అంతా ఫుల్ హ్యాపి. ఇక ఇప్పుడు యాడ్ చేసే సీన్ల కోసం మళ్ళీ ప్రేక్షకులు థియేటర్ బాట పట్టక తప్పదు. అయితే అప్పుడు రన్ టైమ్ ఎక్కువైందని ట్రిమ్ చేసిన రెండు సీన్లు ఇప్పుడు యాడ్ చేశారట.


శ్రీమంతుడు లో మహేష్ బాబు, శృతిహాసన్ :

 

వాటిలో నారాయణ రావు కుటుంబంతో సహా దేవరకోట మొత్తం ఖాళీ చేసి వెళ్లే సీన్ ఒకటైతే.. విలన్ సంపత్ రాజ్ ఊరుమొత్తం ఖాళీ చేయమనే సీన్ ఒకటి. ఈరెండు సీన్లు యాడ్ చేశారని సమాచారం. మనకు ఎంతో ఇచ్చిన ఊరికి మనం కూడా ఎంతో కొంత చేయాలనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా విజయంతో ప్రిన్స్ మహేష్ బాబులో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. ఇక చారిశీల గా శృతి హాసన్ అందాలు కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి.

 

దేవి ఇచ్చిన మ్యూజిక్ కూడా సినిమా ఓ రేంజ్ కు తీసుకెళ్ళింది. మొత్తానికి యాడ్ చేసిన సీన్ల కోసం మళ్ళీ రిపీటెడ్ ఆడియెన్స్ శ్రీమంతుడు చూసి ఇంకా కలెక్షన్ల రికార్డును కొనసాగేలా చేయాలని కోరుకుందాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: