‘బాహుబలి’ నిన్నటితో 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రముఖ అంతర్జాతీయ ఆంగ్ల పత్రిక ‘ఫోర్బ్స్’ ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూను రాజమౌళితో చేసి ఆ ఇంటర్వ్యూను తన లేటెస్ట్ సంచికలో ప్రచురించింది. ఈ ఇంటర్వ్యూను ప్రముఖ హాలీవుడ్ సినిమాల క్రిటిక్ మరియు ఫిలిం మేకర్ రోబ్ కైన్ నిర్వహించాడు. తన ‘బాహుబలి’ సినిమా విశేషాలను ఈ ఇంటర్వ్యూలో వివరిస్తూ రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. 

ఈ ఇంటర్వ్యూలో రాజమౌళిని ఒక విచిత్రమైన ప్రశ్నను రోబ్ కైన్ అడిగాడు ‘ విజయేంద్ర ప్రసాద్ రాజమౌళిల మధ్య ఎవరు రియల్ బాస్?’ అనే ట్విస్ట్ ఇచ్చే ప్రశ్న అడిగాడు దీనికి రాజమౌళి చాల షాకింగ్ రిప్లయ్ ఇచ్చాడు. తాను దర్శకత్వం చేయడం మొదలు పెట్టిన ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమా నుండి లేటెస్ట్ ‘బాహుబలి’ వరకు ప్రతి సినిమా కథను తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించినా ఆ కథల విషయంలో తన తండ్రికి తనకు మధ్య అనేక భేదాభిప్రాయాలు వచ్చాయి అని ఆ భేదాభిప్రాయాలు ఏర్పడినప్పుడు తాము ఒక తండ్రి కొడుకులు లా కాకుండా ఒక శత్రువులు లా ఒకరి పై ఒకరు అరుచుకుంటూ తమ అభిప్రాయాలను తమ ఇంటిలో షేర్ చేసుకుంటామని అసలు విషయాన్ని బయట పెట్టాడు రాజమౌళి.

అయితే ఈ గొడవ జరుగుతున్నప్పుడు తమ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం చూసి తమ కుటుంబ సభ్యులు కూడ వీరికి ఏమైంది అంటూ భయపడిపోతారని అంటూ షాకింగ్ విషయాన్ని లీక్ చేసాడు జక్కన్న. అయితే ఎన్ని భేదాభిప్రాయాలు వచ్చినా తన తండ్రి ఎంత ఫైట్ చేసినా ‘తన తండ్రి పై తానే బాస్’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు రాజమౌళి.

ఇంత మేధోమధనం జరుగుతుంది కాబట్టే రాజమౌళికి అలాంటి వరస హిట్స్ వచ్చాయి. ‘బాహుబలి 2’ విషయంలో కూడ ప్రస్తుతం ఇదే రకమైన మాటల యుద్ధం తమ మధ్య జరుగుతోంది అంటూ రాజమౌళి చెప్పిన విషయం బట్టి ‘బాహుబలి 2’ గురించి కూడ రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడో అర్ధం అవుతుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: