షార్ట్ టైం లో టాప్ ప్రొడ్యూజర్ గా పేరు తెచ్చుకున్న నిర్మాత బండ్ల గణేష్. బండ్ల గణేష్ ప్రొడక్షన్ లో మూవీలు చేయటానికి హీరోలు క్యూలు కట్టేవాళ్ళు. ఎందుకంటే బండ్ల గణేష్ నిర్మాత సంస్థ విలువలు చాలా గొప్పగా ఉంటాయి. హీరోలకి రెమ్యునరేషన్ సైతం బాగానే ఉంటుంది. అలాగే హీరోయిన్స్ సైతం బండ్ల గణేష్ నిర్మాణ సంస్థలో పనిచేయటానికి ఈ కారణాలతోనే ఆసక్తి చూపేవారు.

ఇదిలా ఉంటే గత కొంత కాలంగా బండ్ల గణేష్ చాలా సైలెంట్ అయిపోయాడు. ఎందుకు బండ్ల కామ్ గా ఉంటున్నాడన్నదానిపై ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి. పవన్ హీరోగా 'గబ్బర్ సింగ్' చరణ్ హీరోగా గోవిందుడు అందరివాడేలే తెరకెక్కించాడు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ తో టెంపర్ తీశాడు.

గోవిందుడు యావరేజ్ టాక్ వచ్చినా టెంపర్ హిట్టయ్యింది. భారీ లాభాల్లేకపోయినా నష్టాలైతే రాలేదని అన్నారంతా. మరోసారి ఈ హీరోలతో సినిమాలు తీసేద్దామన్నా ఎవరూ అందుబాటులో లేరు. బండ్ల గణేష్ మాత్రం రామ్ చరణ్, బన్నీ డేట్స్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. అలాగే తాజాగా వరుణ్ తేజ్ డేట్స్ కోసం బండ్ల హై ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది.

అలాగే గతంలో బండ్ల గణేష్ స్టార్ల తోనే కాదు చిన్న హీరోలతోనూ సినిమాలు తీస్తాను మనసు మార్చుకున్నా అని చెప్పాడు. స్టార్లు దొరక్కపోతేనైనా చిన్న హీరోలతో సినిమాలు తీసేస్తానని అన్నాడు. ఇప్పుడు చిన్న హీరోలు ఉన్నప్పటికీ తను సాహసం చేయటానికి ముందుకు రావటం లేదు. మొత్తంగా బండ్ల గణేష్ మాస్టర్ సైలెంట్ గా ఉండటానికి తనపై వస్తున్న కోర్టు కేసులే అని మరికొంత మంది అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: