నిన్న సాయంత్రం విడుదల అయిన ‘అఖిల్’ మూవీ టీజర్ చూసిన వాళ్ళు అఖిల్ ను ఒక వైపు పోగుడుతూనే మరొక వైపు అఖిల్ తనతో పాటు ఈసినిమాలో నటిస్తున్న హీరోయిన్ సయేషా సెహగల్‌ కు ఊహించని షాక్ ఎందుకు ఇచ్చాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం నిన్న విడుదలైన టీజర్ లో ఏ ఒక్క షాట్ లోను హీరోయిన్ సయేషా కనిపించకుండా మొత్తం అంతా అఖిల్ ప్రాభవమే కనిపించడం. నిన్న విడుదలైన ఈ టీజర్ ఈసినిమా పై మరిన్ని అంచనాలను పెంచేసింది. 

అఖిల్ ను మాస్ హీరోగా చూపెట్టడానికి వినాయక్ తీసుకున్న జాగ్రత్తలు ఈ టీజర్ లోని ప్రతి సీన్ లోను కనిపించాయి. విలన్‌ కి అఖిల్‌ ఇచ్చే పంచ్‌, చార్మినార్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో జరిగే సీన్ 'అఖిల్‌' ట్రైలర్‌ ని  హైలైట్‌గా నిలిచాయి. పక్కా మాస్ లుక్ తో అఖిల్ కనిపిస్తున్న ఈటీజర్ ను బట్టి ఈ సినిమా అఖిల్‌ ను మొదటి ప్రయత్నంలోనే టాప్ మాస్ హీరోగా మార్చాలి అన్న నినాయాక్ ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. 

టెక్నికల్ గా కూడ ఈసినిమా అద్భుతంగా ఉంటుందనే సంకేతాలు ఈ టీజర్ ద్వారా వినాయక్ అక్కినేని అభిమానులకు అందించాడు. అఖిల్ తన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఫైర్ బాల్ చేతిలో పెట్టుకుని కనిపిస్తే నిన్న సాయంత్రం విడుదలైన టీజర్ లో ఈసినిమాలోని ప్రతి సీన్ లోను తాను ఫైర్ బాల్ లా కనిపించబోతున్నానని  సంకేతాలు ఇచ్చాడు. ఈవార్తలు ఇలా ఉండగా అఖిల్ సినిమా పై అప్పుడే 47 కోట్ల బిజినెస్ జరిగింది అని వార్తలు వస్తున్నాయి. 

టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే ఒక హీరో తొలి సినిమాకు ఈ రేంజ్ లో ఇప్పటి వరకు బిజినెస్ అయిన సందర్భాలు గతంలో లేవు. అక్కినేని వారసత్వాన్ని కొనసాగిస్తూ బిజినెస్ పరంగా కూడ తొలి సినిమాతోనే సంచలనాలు సృష్టిస్తున్న ‘అఖిల్’ టీజర్ పై వస్తున్న ప్రశంసలు నాగార్జునను జోష్ లో ముంచేసాయి అని తెలుస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: