శ్రీనువైట్ల రామ్ చరణ్ తో తీస్తున్న సినిమాకు ‘బ్రూస్ లీ’ అనే టైటిల్ అధికారికంగా ప్రకటించి కొన్నిరోజులు కూడ గడవకుండానే ఈసినిమా పై వస్తున్న రూమర్స్ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఈసినిమాను ఎట్టిపరిస్తుతులలోను రాబోతున్న దసరా ముందు విడుదలచేయాలని  శ్రీనువైట్ల ఎన్నిప్రయత్నాలు చేస్తున్నా కొన్నిఅనుకోని పరిస్థుతులు అడ్డు తగులుతున్నాయి అనేవార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తలప్రకారం ఈసినిమావిడుదల దసరా సీజన్ కు ఉండకపోవచ్చు అనే రూమర్స్ హడావిడి చేస్తున్నాయి. 

దీనికికారణం ఇప్పటికీ ఈసినిమా టాకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ కాకపోవడం, కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించాల్సిన బ్యాలన్స్ ఉండటంతో పాటు చిరంజీవికి సంబంధించిన 15 నిముషాల అతిథిపాత్ర షూటింగ్ పూర్తి కాకపోవడం అనే కారణాలు వినిపిస్తున్నాయి. ఈపనులన్నీ పూర్తి చేసుకుని ఆతరువాత పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని కేవలం ఇక మిగిలి ఉన్న 45 రోజులలో ఈసినిమాను విడుదలచేయడం అసాధ్యం అనే భావనకు అప్పుడే చరణ్ వినాయక్ లు వచ్చేశారు అనేవార్తలు వస్తున్నాయి. 

ఈవార్తలే నిజం అయితే అక్టోబర్ 2న విడుదల కాబోతున్న ‘సైజ్ జీరో’, ‘కంచె’, ‘శివమ్’ సినిమాలకు పండుగ అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదీకాకుండా అక్టోబర్ 21న విడుదల అవ్వడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్న అఖిల్ సినిమాకు ముందు పోటీగా తనసినిమాను విడుదల చేయడం చరణ్ కు అంతగా ఇష్టంలేదు అనేటాక్ కూడ ఉంది. చిరంజీవికి నాగార్జునకు ఉన్న సాన్నిహిత్యం రీత్యా ధియేటర్ల విషయంలో తమ ఇద్దరిమధ్య అనవసరమైన పోటీ జరగడం చరణ్ కు నచ్చడం లేదు అనేవార్తలు కూడ ఉన్నాయి. 

అయితే చరణ్ ‘బ్రూస్ లీ’ నైజాం హక్కులను భారీ మొత్తానికి తీసుకున్న దిల్ రాజ్ మటుకు ఈసినిమాను ఎట్టి పరిస్తుతులలోను అనుకున్న విధంగా అక్టోబర్ 15న విడుదల చేయవలసిందే అని ఒత్తిడి పెంచినట్లు టాక్. ఈ ఒత్తిడి వెనుక మరోకారణం కూడ ఉంది అనిఅంటున్నారు. దిల్ రాజ్ కు నితిన్ తండ్రి సుధాకర రెడ్డికి ఎప్పటినుంచో ఉన్న వ్యాపార భేదాభిప్రాయాలు వలన నితిన్ నిర్మిస్తున్న అఖిల్ సినిమాకన్నా తన సినిమా ముందు ఉండాలని దిల్ రాజు ఎత్తుగడ అని అంటున్నారు. సినిమా పూర్తి అవ్వకపోవడంతో పాటు దిల్ రాజ్ ఒత్తిడి మధ్య ‘బ్రూస్ లీ’ నలిగిపోతున్నాడు అని సెటైర్లు పడుతున్నాయి...


మరింత సమాచారం తెలుసుకోండి: