నాగచైతన్య సినిమాలలో మొట్టమొదటి తొలి బ్లాక్ బస్టర్ హిట్ ‘ఏమాయ చేసావే'సినిమా అంత క్రేజ్ రావడానికి సమంత కారణం అన్నది ప్రతి ఒక్కరూ అంగీకరించే విషయం.  సమంత టాలీవుడ్ ఎంట్రీకుడా ఈసినిమా తోనే జరిగినా ఈసినిమాలో వీరిద్దరి జంటకు మంచి పేరు రావడంతో టాలీవుడ్ లక్కీ పెయిర్ గా వీరిద్దరూ మారిపోయారు. ఆ తరువాత ఈ క్రేజి కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ చాల సినిమాలు వచ్చాయి. 

సమంత టాప్ హీరోయిన్ స్టేటస్ కు వెళ్ళి పోయినా ఇంకా చైతూ పట్ల తన అభిమానాన్ని చూపెట్టడమే కాకుండా చైతన్య పై సెటైర్లు వేస్తూ ఆట పట్టించిన విషయం ఈమధ్యనే జరిగింది.  నాగచైతన్య దర్శకుడు గౌతమ్ మీనన్ ల కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ నిర్మిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీకి ‘సాహసం శ్వాసగా సాగిపో’ అనే టైటిల్‌ను పెట్టి టీజర్ విడుదల చేసారు. మలయాళ హీరోయిన్ మంజిమ మోహన్ ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సరసన నటిస్తోంది. 

నాగార్జున పుట్టినరోజునాడు విడుదలైన ఈ టీజర్ కు మంచి టాక్ వచ్చింది. అయితే ఈ టీజర్ ను సమంత చూడటమే కాకుండా తన ట్విటర్ లో నాగచైతన్యను ఆట పట్టిస్తూ సెటైర్లు పోస్ట్ చేసింది. ‘నీ సినిమా టీజర్ ను చూసాను 2010లో అమ్మాయిలను మాయచేసిన డ్రీమ్ బాయ్ గా మళ్ళీ మారబోతున్నావు’ అంటూ ట్విట్ చేసింది. దానికి చైతూ సమాధానం ఇస్తూ ‘కృతజ్ఞతలు శామ్ నీవు నా వెంట ఉన్నంత వరకు’ అంటూ రిప్లయ్ ఇచ్చాడు చైతన్య. 

అయితే సమంత ఈ రిప్లయ్ ట్విట్ కు చైతు మైండ్ బ్లాంక్ చేసే విధంగా ‘ఇప్పుడు నీకు నేను అందుబాటులో లేనుగా’ అంటూ తాను దక్షిణాది సినిమా రంగానికి టాప్ హీరోయిన్ అయిన విషయాన్ని నాగచైతన్యకు గుర్తు చేసింది. అయితే ఇలా ట్విట్ చేయడం వెనుక ఉద్దేశ్యం చైతన్యను ఆట పట్టించడానికా లేదంటే తన గొప్పతనాన్ని తెలియచేయడానికా ? అన్న విషయమై రకరకాల మాటలు వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: